‘శ్రీమంతుడు’ సినిమాతో చారుశీల పేరు ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆ సినిమాలో హీరోయిన్గా నటించిన శృతిహాసన్ చారుశీలగా చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
చారుశీల స్వప్నబాల అంటూ ఏకంగా ఒక పాటే మహేష్బాబు పాడగా, ఈ సినిమాలో ఉంది.అంతటి క్రేజ్ను దక్కించుకున్న చారుశీల పేరును ఉపయోగించుకునేందుకు జబర్దస్త్ బ్యూటీ రష్మీ సిద్దం అయ్యింది.
‘చారుశీల’ పేరుతో తెరకెక్కబోతున్న ఒక సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్గా బుక్ అయ్యింది.
‘జబర్దస్త్’తో హీరోయిన్ కంటే ఎక్కువ క్రేజ్ను దక్కించుకున్న రష్మీ అప్పుడప్పుడు వెండి తెరపై కూడా సందడి చేస్తోంది.
తాజాగా ఈమె ‘గుంటూరు టాకీస్’ సినిమాలో ఒక హీరోయిన్గా నటించింది.ఆ సినిమా త్వరలో విడుదల కానుంది.
జాతీయ అవార్డు గ్రహీత ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా విడుదల కాకుండానే ఈమెకు ‘చారుశీ’ సినిమాలో నటించే అవకాశం దక్కింది.శ్రీనివాస్ ఉయ్యూర్ అనే వ్యక్తి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నట్లుగా తెలుస్తోంది.
‘చారుశీల’లో రష్మీ తన అందాలతో ఆకట్టుకోనుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.