ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కి ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయిన వారిలో కమెడియన్ ప్రవీణ్ కూడా ఒకరు.మొదట పటాస్ స్టేజ్ ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ప్రవీణ్ ఆ తర్వాత జబర్దస్త్ కీ ఎంట్రీ ఇచ్చి బుల్లెట్ భాస్కర్ స్కిట్లో చేస్తూ మంచి పాపులారిటిని సంపాదించుకున్నాడు.
ఇక ఫైమా తో కలిసి లవ్ ట్రాక్ అంటూ మరింత ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు ప్రవీణ్.ఇక తనదైన శైలిలో కామెడీ చేస్తూ ప్రేక్షకులను కరుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు.
అలాగే రాకింగ్ రాకేష్ స్కిట్లలో కూడా చేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటాడు ప్రవీణ్.ఇక జడ్జ్ ఇంద్రజ కీ జబర్దస్త్ లో అందరి కంటే ఎక్కువ ఇష్టమైన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ప్రవీణ్ అని చెప్పవచ్చు.
ఇంద్రజ కూడా ప్రవీణ్ ని తన కొడుకుల భావిస్తూ ఓదారుస్తూ ఉంటుంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఎక్సట్రా జబర్దస్త్ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.
ఆ ప్రోమో లో ఒక్కొక్కరు వారి వారి స్కిట్ల పర్ఫామెన్స్ లతో జడ్జిలతో పాటు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు.ఇక రాకింగ్ రాకేష్ స్కిట్ లో చేస్తూ రాకేష్, సుజాత లపై పంచులు వేసి బాగానే నవ్వించిన ప్రవీణ్.
కానీ చివర్లో తన బాధను చెప్పుకొని అందరినీ ఒక్కసారిగా ఏడిపించేశాడు.
చాలా రోజుల క్రితమే తన తల్లి చనిపోయిందని, ఆ తర్వాత తన నాన్న అన్ని అయ్యి తనని చూసుకున్నాడని, ఇప్పుడు ఆయన కూడా లేడు ఒంటరి వాడిని అయిపోయాను అని చెప్పుకుంటూ ఎమోషనల్ అయ్యాడు ప్రవీణ్.నేను ఏ బాధ వచ్చినా మా నాన్నకు చెప్పుకునే వాడిని.మా నాన్న కూడా ఎంత లేట్ అయినా కూడా రాత్రి నాకు ఫోన్ చేసి తిన్నావా అని అడిగిన తర్వాతే పడుకునేవాడు అంటూ తన బాధ చెప్పుకొని ఎమోషనల్ అయ్యాడు ప్రవీణ్.
ఇక ప్రవీణ్ బాధను చూసి పక్కనే ఉన్న యాంకర్ రష్మీ కూడా ఫుల్ ఎమోషనల్ అయ్యింది.అలాగే పక్కనే ఉన్న తోటి కమెడియన్లు కూడా ఎమోషనల్ అయ్యారు.
అనంతరం జడ్జి ఇంద్రజ నీకు మేము ఉన్నాము అధైర్య పడకు అంటూ దగ్గరికి పిలుచుకుని ఓదార్చింది.ఇందుకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.