బుల్లితెరపై యాంకర్ గా, నటుడిగా, కమెడియన్ గా గుర్తింపును సొంతం చేసుకొని సోషల్ మీడియాలో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నవాళ్లలో సుడిగాలి సుధీర్ ఒకరు.పైకి ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సుధీర్ ఈ స్థాయికి చేరుకోవడం కోసం ఎన్నో కష్టాలు పడ్డారు.
అయితే తాజాగా సుడిగాలి సుధీర్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది.సుధీర్ వాళ్ల అమ్మమ్మ మూడు రోజుల క్రితం చనిపోయారు.
తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో రిలీజ్ కాగా రామ్ ప్రసాద్ ఈ విషయాన్ని వెల్లడించారు.అమ్మమ్మను చూడటానికి వెళ్లలేక పోయినందుకు సుధీర్ చాలా బాధపడ్డారని రామ్ ప్రసాద్ తెలిపారు.
సుడిగాలి సుధీర్ షోలో కన్నీటి పర్యంతమయ్యారు.లోపల బాధ ఉన్నప్పటికీ సుధీర్ మాత్రం పైకి నవ్వుతూ కనిపించడం గమనార్హం.
మరోవైపు సుడిగాలి సుధీర్ పూర్తిగా టీవీ షోలకే పరిమితమయ్యారు.
సుడిగాలి సుధీర్ హీరోగా రెండు సినిమాలలో నటించగా ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్ కాలేదు.
సుధీర్ ప్రస్తుతం జబర్దస్త్, ఢీ షోలతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షో చేస్తున్నారు.ఈ మూడు షోలు మంచి టీఆర్పీ రేటింగ్ లను సొంతం చేసుకుంటున్నాయి.
ఈ వారం శ్రీదేవి డ్రామా కంపెనీలో పృథ్వీ రాజ్, హేమలతో ఆడియో ఫంక్షన్ నిర్వహించారు.పృథ్వీ, హేమ కామెడీ చేసి నవ్వులపువ్వులు పూయించారు.
హైపర్ ఆది మాట్లాడుతూ పృథ్వీ గురించి చెప్పడానికి తనకు ఉన్న శక్తి సరిపోదని, వొకాబులరీ సరిపోదని, పేమెంట్ కూడా సరిపోదని ఆది అన్నారు.అసలు ఈ ఈవెంట్ లో స్పేస్ లేదని హేమగారిని ఇరికించారని ఆది అన్నారు.బుల్లెట్ భాస్కర్ చిరంజీవి వాయిస్ ను మిమిక్రీ చేస్తూ సుధీర్ తెలుగులో పోగ్రామ్స్ చేస్తుంటే కన్నడలో కామెంట్స్ వస్తున్నాయని పేర్కొన్నారు.