తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి మనందరికీ తెలిసిందే.జబర్దస్త్ షో ద్వారా ఎంతోమంది కమెడియన్లు ఆర్టిస్టులు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.
ఈ జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఎంతోమంది కమెడియన్లు ఇప్పటికే వెండితెరపై అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు.దశాబ్దకాలం పాటు జబర్దస్త్ లో ఉన్న వారు టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు.
ఇకపోతే జబర్దస్త్ షోలో మంచి ఆదాయం వస్తున్నప్పటికీ పలువురు కమెడియన్లు కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చేస్తున్నారు.ఈ మధ్య జబర్దస్త్ నుంచి కమెడియన్ లు ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు.
ఇప్పటికే ఎంతమంది కమెడియన్లు జబర్దస్త్ నుంచి వెళ్లిపోగా ఇటీవలే హైపర్ ఆది, గెటప్ శీను, సుడిగాలి సుదీర్ లాంటి కమెడియన్ వెళ్లిపోయిన విషయం తెలిసిందే.సుడిగాలి సుధీర్ టీమ్ కూడా అదే తరహాలో జబర్దస్త్ దూరమవుతున్నట్లు ఇటీవలే ఒక కమెడియన్ వివరించిన విషయం తెలిసిందే.
టౌన్ లోని వారి పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఇకపోతే జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్ టీమ్ కు ఉన్న ప్రత్యేకత గురించి మనందరికీ తెలిసిందే.
జబర్దస్త్ కమెడియన్ లు టీమ్స్ మారుతూ ఉన్నాకూడా సుడిగాలి సుదీర్ టీం మాత్రం నిలకడగానే ఉన్నారు.మొదటి నుంచి వీరు ముగ్గురూ కలిసి కామెడీ చేసి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ వచ్చారు.
మొదటి నుంచి కలిసి ఉన్న వారు అవకాశాల కారణంగా అలాగే ఇతర కారణాల కారణంగా ఆటో రాంప్రసాద్ అని వదిలేసి సుడిగాలి సుధీర్ గెటప్ శీను వెళ్లిపోవడంతో ఆటో రాంప్రసాద్ ఒంటరిగా మిగిలిపోయాడు.జబర్దస్త్ గ్యాప్ ఇవ్వడం ఆ షోపై కొంత గట్టిగానే ప్రభావం చూపిస్తోంది.
ఇది ఇలా ఉంటే వీరి ముగ్గురి మధ్య విభేదాలు రావడానికి పలు రకాల కారణాలు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి.కానీ వాటిలో ఎటువంటి నిజం లేదు అని తాజాగా ఒక కమెడియన్ తెలిపారు.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రముఖ కమెడియన్ రాకింగ్ రాకేష్ వారు ముగ్గురు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
వాళ్ల ముగ్గురికీ మిగతా వారికి ఉన్న తేడా ఏమిటంటే వాళ్ళు స్టేజి పైకి వస్తే హావభావాలతోనే నవ్విస్తారు అదొక అదృష్టం ఉంది.వాళ్ళు ఫెసెస్ అలాంటివి కానీ మేము మాత్రం రాత్రి,పగలు స్క్రిప్టు రాసుకుని పంచులు రెడీ చేసుకుని ఉండాలి అని తెలిపాడు రాకేష్.అలాగే నిజానికి జబర్దస్త్ నుంచి కొందరు దూరం అవ్వడానికి కారణం ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి ఎదగాలని ఆలోచన ఉండటమే అని తెలిపారు.
సినిమాల్లో ఎక్కువగా అవకాశాలు వస్తుండటంతో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయలేక కొందరు కమెడియన్స్ జబర్దస్త్ కి దూరం అవుతున్నారు అని తెలిపారు రాకేష్.సుడిగాలి సుధీర్ టీం కూడా ఇదే తరహాలో ముందుకు సాగుతోంది అన్నట్లు వివరణ ఇచ్చాడు.