ఈటీవీ ఛానెల్ లో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ప్రతిభ ఉన్న ఎంతోమంది కమెడియన్లను ప్రేక్షకులకు పరిచయం చేసింది.ఈ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో కొందరు వరుస సినిమా అవకాశాలతో బిజీ కాగా మరి కొందరికి ఇతర కామెడీ షోలలో అవకాశాలు వస్తున్నాయి.
అలా జబర్దస్త్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో శాంతి స్వరూప్ కూడా ఒకరు.స్కిట్లలో శాంతి స్వరూప్ ఎక్కువగా లేడీ పాత్రల్లోనే కనిపిస్తూ ఉంటారు.
నిజ జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించిన శాంతి స్వరూప్ జబర్దస్త్ షో ద్వారా ఆర్థికంగా మంచి స్థాయికి ఎదిగారు.ఎక్కువగా హైపర్ ఆది టీమ్ లో కనిపిస్తూ శాంతి స్వరూప్ గుర్తింపు తెచ్చుకున్నారు.
అయితే జబర్దస్త్ షోలో బయట ప్రచారం జరుగుతున్నట్టు రెమ్యునరేషన్ ఉండదని కొన్ని టీమ్స్ లోని సభ్యులు పది వేల లోపు రెమ్యునరేషన్ కూడా తీసుకుంటారని శాంతి స్వరూప్ వెల్లడించారు.అయితే బయట ఈవెంట్స్ ద్వారా డబ్బులు బాగానే వస్తాయని వెల్లడించారు.
తన జీవితంలో డబ్బు వల్ల పడిన కష్టాల గురించి కూడా శాంతి స్వరూప్ చెప్పుకొచ్చారు.అందరినీ కడుపుబ్బా నవ్వించే శాంతి స్వరూప్ తండ్రి అంత్యక్రియలు చెసేందుకు కూడా డబ్బుల్లేని దారుణమైన పరిస్థితిని అనుభవించారు.
ఒక ఇంటర్వ్యూలో శాంతి స్వరూప్ మాట్లాడుతూ తాను నిరుపేద కుటుంబంలో పుట్టానని.జీవితంలో చాలా కష్టాలు అనుభవించానని అన్నారు.
పదమూడేళ్ల క్రితం తన తండ్రి మృతి చెందాడని ఆ సమయంలో హైదరాబాద్ లో ఉన్న తనకు 2 వేల రూపాయలు అవసరమైందని.తెలిసిన ఒక అసిస్టెంట్ దగ్గర 2 వేల రూపాయలు అప్పు తీసుకుని అంత్యక్రియలు నిర్వహించానని అన్నారు.
ఇతరులకు తనలాంటి కష్టాలు రాకూడదని కోరుకుంటున్నానని శాంతిస్వరూప్ చెప్పారు.సోషల్ మీడియాలో రెమ్యునరేషన్ల గురించి జరిగే ప్రచారం నిజం కాదని శాంతి స్వరూప్ తెలిపారు.