ప్రముఖ జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన పంచ్ ప్రసాద్ ఈటీవీ షోల ద్వారా నెలకు ఏకంగా మూడున్నర లక్షల రూపాయల రేంజ్ లో సంపాదిస్తున్నారని కొన్ని నెలల క్రితం వార్తలు వైరల్ అయిన సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో పంచ్ ప్రసాద్ టీవీ షోలలో ఎక్కువగా కనిపించడం లేదు.
ప్రస్తుతం ఈ కమెడియన్ నడవలేని స్థితిలో ఉన్నారని సమాచారం అందుతోంది.ఏ రీజన్ వల్ల ఆయన నడవలేకపోతున్నారో కూడా తెలియడం లేదని సమాచారం.
ఏ కామెడీ షోలో కనిపించినా తన పంచ్ లతో నవ్వించే పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నారని గతంలో వార్తలు వైరల్ అయ్యాయి.తాజాగా యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేసిన వీడియో ద్వారా ప్రసాద్ కొత్త ఆరోగ్య సమస్య గురించి వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ కమెడియన్లలో ఒకరైన నూకరాజు చేసిన వ్లాగ్ ద్వారా నెటిజన్లకు పంచ్ ప్రసాద్ అనారోగ్య సమస్యల గురించి తెలిసింది.
పంచ్ ప్రసాద్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటుండగా ఆయనకు ఆర్థిక ఇబ్బందులు కూడా ఉన్నాయని సమాచారం అందుతోంది.
మొదట నడుము నొప్పితో పంచ్ ప్రసాద్ ఇబ్బంది ఇబ్బంది పడ్డాడని నడుము వెనుక వైపు నుంచి కుడి కాలి వరకు చీము పట్టిందని పరీక్షల ద్వారా తెలిసిందని పంచ్ ప్రసాద్ కుటుంబ సభ్యులు తెలిపారు.పంచ్ ప్రసాద్ కు సహాయం చేయాలని నూకరాజు కోరారు.
నూకరాజు వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.పంచ్ ప్రసాద్ తిరిగి సాధారణ స్థితికి చేరుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.పంచ్ ప్రసాద్ సాధారణ మనిషి కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ స్పందిస్తే అతని ఆరోగ్యానికి సంబంధించి మరికొన్ని విషయాలు తెలిసే ఛాన్స్ ఉంది.