గత రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ న్యూస్ ఛానల్ పెట్టిన మనకు మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి వార్తలు పెద్దఎత్తున వస్తున్నాయి.గత రెండు రోజుల నుంచి సాయి ధరమ్ తేజ్ ప్రమాదానికి గురవడానికి గల కారణం ఇదేనంటూ ఎన్నో కథనాలు అల్లుతూ పలు మీడియా సంస్థలు ప్రసారం చేస్తున్నాయి.
ఈ విధంగా వారికి అనుగుణంగా తప్పుడు కథనాలు రాసే మీడియాపై పలువురు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ వార్తలను ఖండిస్తున్నారు.
ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి వస్తున్న వార్తలను తీవ్రస్థాయిలో ఖండించారు.
సాధారణంగా హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు పెద్ద అభిమాని అలాంటిది మెగా కుటుంబంలో ఒక హీరో రోడ్డు ప్రమాదానికి గురవడంతో హైపర్ ఆది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మీలాంటి మంచి వ్యక్తికి ఏమీ కాదు.మిమ్మల్ని అలా చూస్తుంటే కన్నీళ్లు ఆగడం లేదు అన్నా అంటూ ఎమోషనల్ అయ్యారు.
ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి తప్పుడు కథనాలు అల్లే తెలుగు మీడియాపై హైపర్ ఆది తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ సంధించాడు.
తెలుగు మీడియా సాయి ధరమ్ తేజ్ ప్రమాదం గురించి వార్తలు రాస్తూ అతను 300-400 స్పీడ్తో వెళ్ళడం వల్లే ప్రమాదానికి గురైనట్లని వార్తలు రాయడంతో ఆ వార్తలను హైపర్ ఆది ఖండించారు.మన హైదరాబాద్ రోడ్లపై బ్యాట్స్ మెన్, సూపర్ మెన్ కూడా అంతే వేగంతో ప్రయాణించే లేరు.మీరెక్కడ దొరికారా మాకు.
మీ బ్రతుకులు చెడ అంటూ సదరు తెలుగు మీడియా సమస్త పై హైపర్ ఆది ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.ఈయన చేసిన ట్వీట్స్ కు నెటిజన్ల నుంచి సానుకూల స్పందన వస్తోంది.
కొన్ని చానల్స్ కేవలం రేటింగ్స్ కోసమే ఈ విధమైనటువంటి తప్పుడు కథనాలు అల్లుతూ వార్తలు రాస్తున్నారని హైపర్ ఆది మండిపడ్డారు.