బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి.ఇలాంటి కార్యక్రమాలలో మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నిర్వహించే జబర్దస్త్ ,ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలు ప్రేక్షకులను ఎంతగానో సందడి చేస్తున్నాయని చెప్పవచ్చు.
ఇందులో భాగంగా ఎంతో మంది కమెడియన్స్ వివిధ రకాల స్కిట్లతో ప్రేక్షకులను సందడి చేస్తుంటారు.గత కొద్దిరోజుల నుంచి జబర్దస్త్ వేదికపై ఇమ్మాన్యుయేల్, వర్ష జంటకు భారీ క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు.
స్టేజ్ పై ఈ జంట చేసే రచ్చ ప్రేక్షకులను ఎంతో సందడి చేస్తుంది.,/br>
ఈ క్రమంలోనే వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తుంటాయి.
వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.అయితే వీరిద్దరూ ఆన్ స్క్రీన్ పై కనిపించినంత క్లోజ్ గా నిజ జీవితంలో ఉండరనే విషయాన్ని ఆర్టిస్ట్ మహిధర్ వీరి గురించి సంచలన విషయాలు బయటపెట్టాడు.
వర్ష, ఇమ్మానియేల్ కేవలం తెరపై మాత్రమే అలా ఉంటారని షూటింగ్ అయిపోగానే అసలు ఎవరి దారి వారు చూసుకుంటారని తెలియజేశారు.అదే విధంగా ఇప్పటి వరకు ఇమ్మానియేల్ ఫోన్ నెంబర్ కూడా వర్ష దగ్గర లేదన్న విషయాన్ని మహీధర్ బయటపెట్టాడు.
ప్రస్తుతం బుల్లితెరపై రష్మి సుదీర్ జంటకు ఎంతో క్రేజ్ ఉందని, సుధీర్, రష్మీ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఎక్కువ కాలం నడపడం కుదరదు కనుక మల్లెమాల యూనిట్ కొత్తజంటను తెరపైకి తీసుకు వచ్చిందని ఈ సందర్భంగా తెలిపారు.నిజ జీవితంలో ఇలా ఎంతో దూరంగా ఉన్నప్పటికీ వీరి గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తుంటాయి.కేవలం ఆ షో రేటింగ్స్ కోసమే వీరిద్దరి మధ్య ఈ విధమైనటువంటి రిలేషన్ ని ఆన్ స్క్రీన్ పై చూపిస్తారన్న విషయాన్ని మహీధర్ తెలియజేశారు.ఇలా వర్ష, ఇమ్మానియేల్ నిజజీవితంలో ఎలా ఉంటారో ఈ సందర్భంగా ఆర్టిస్ట్ మహీధర్ తెలిపారు.