జబర్దస్త్ షోలో చమ్మక్ చంద్ర టీంలో చేయడం ద్వారా సత్యశ్రీ( Satya Sri ) ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారనే సంగతి తెలిసిందే.సత్యశ్రీ ఈ షోకు భారీ స్థాయిలో పారితోషికం అందుకున్నారని టాక్ ఉంది.
అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన సత్యశ్రీ తన పొలిటికల్ బ్యాగ్రౌండ్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.లెజెండ్ సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆమె తెలిపారు.
డైలాగ్ ఎలా చెప్పాలో బోయపాటి శ్రీను( Boyapati Srinu ) గారు యాక్టింగ్ చేసి చూపించారని సత్యశ్రీ అన్నారు.సరైనోడు, జయ జానకి నాయక సినిమాలలో కూడా చేశానని ఆమె తెలిపారు.రాజా ది గ్రేట్ ఫేవరెట్ మూవీ అని అందులో మంచి పాత్ర దక్కిందని సత్యశ్రీ అన్నారు.డేట్స్ క్లాష్ కావడం వల్ల కొన్ని ప్రాజెక్ట్ లు మిస్ అయ్యాయని ఆమె పేర్కొన్నారు.
బంగార్రాజు సినిమాను మరో మూవీ వల్ల మిస్ చేసుకోవాల్సి వచ్చిందని సత్యశ్రీ అన్నారు.
నాగార్జున, నాగచైతన్య కాంబో సినిమా మిస్ చేసుకున్నానని బాధ కలిగిందని ఆమె తెలిపారు.2014లో పదో తరగతి అయిపోయిందని ఆమె తెలిపారు.నాకు కల్చరల్ యాక్టివిటీస్ అంటే ఇష్టమని సత్యశ్రీ పేర్కొన్నారు.
అమ్మ నాకోసం తన ఇండస్ట్రీ లైఫ్ ను త్యాగం చేసిందని సత్యశ్రీ అన్నారు.అమ్మమ్మది కాకినాడ అని ఆమె చనిపోయారని సత్యశ్రీ తెలిపారు.
అమ్మమ్మగారు వైఎస్సార్ గారి పార్టీలో( YSR ) ఉండేవారని పార్టీ తరపున సేవా కార్యక్రమాలు చేసేవారని సత్యశ్రీ అన్నారు.అమ్మమ్మ చాలామందికి ఉపాధి కల్పించిందని ఆమె తెలిపారు.
నా సిస్టర్ కు సినిమాలు అంటే ఇష్టం లేదని నా చెల్లెలు పేరు కీర్తిశ్రీ అని సత్యశ్రీ కామెంట్లు చేశారు.పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నా సత్యశ్రీ రియల్ లైఫ్ లో సింపుల్ గా ఉండటానికి ఇష్టపడటం వల్ల ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది.