జబర్దస్త్ షో ప్రారంభమైనప్పటి నుంచి తన యాంకరింగ్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో లక్షల సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు అనసూయ.ఒకవైపు టీవీ షోలు ఎన్ని ఉన్నా సినిమాల్లో కూడా నటిస్తూ వెండితెరపై కూడా అనసూయ విజయాలు సాధిస్తున్నారు.
రవితేజ ఖిలాడి సినిమాలో ఒక ముఖ్య పాత్రలో అనసూయ నటిస్తుండగా సర్కార్ వారి పాట సినిమాలో కూడా అనసూయకు ఛాన్స్ దక్కినట్టు తెలుస్తోంది.
అయితే అవకాశాలు పెరుగుతున్నా అనసూయ మాత్రం గుర్తింపు రావడానికి కారణమైన జబర్దస్త్ షోకు యాంకర్ గా కొనసాగుతోంది.
ఈటీవీ ఛానల్ పండుగ సమయాల్లో, ప్రత్యేక రోజుల్లో ఈవెంట్లు నిర్వహిస్తుందనే సంగతి తెలిసిందే.రేపు నూతన సంవత్సరం కావడంతో ఈటీవీ ఈరోజు డీజే పేరుతో స్పెషల్ ప్రోగ్రామ్ ను ప్రసారం చేస్తోంది.
ఈ ప్రోగ్రామ్ లో రాకెట్ రాఘల్ స్కిట్ లో భాగంగా అనసూయను చంపేస్తాననేలా కోపంతో ఊగిపోతూ కామెడీ పండించాడు.
స్కిట్ లో చంటి రోజా గురించి చెప్పమని అడగగా చలాకీ చంటీ మద్యం తాగిన పాత్రలో ఆమె మహాలక్ష్మీ అని చెబుతాడు.
ఆ తరువాత చంటి జబర్దస్త్ లో యాంకర్ అనసూయ గురించి చెప్పమని అడగగానే కోపంతో ఊగిపోతాడు.ఆమె అందరి స్కిట్లకు నవ్వుతుందని తన స్కిట్లకు మాత్రం నవ్వదని చెప్పాడు.
అనసూయ వెంటనే తాను నవ్వుతానంటూ విచిత్రమైన ఎక్స్ ప్రెషన్ పెట్టింది.
ఈరోజు రాత్రి 9 : 30 గంటల నుంచి ఈ షో గురించి ప్రసారం కానుంది.ఈటీవీలో ప్రసారమవుతున్న ప్రతి ఈవెంట్ సక్సెస్ అవుతుండగా ఈ ఈవెంట్ కూడా మంచి టీఆర్పీ రేటింగ్ అందుకుంటుందని ఈటీవీ నిర్వాహకులు భావిస్తున్నారు.జబర్దస్త్ కామెడీ స్కిట్లతో పాటు ఢీ షో డ్యాన్సులు ఈ ఈవెంట్ లో ప్రసారం కానున్నాయి.
గత కొన్నేళ్ల నుంచి ఈటీవీ ఛానల్ డిసెంబర్ 31వ తేదీన డీజే తరహా స్పెషల్ ప్రోగ్రామ్ లను ప్రసారం చేస్తోంది.