టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా మా ఎన్నికల గురించిన చర్చ జరుగుతోంది.ప్రకాష్ రాజ్ మరియు మంచు విష్ణు లో ఎవరిది పై చేయి సాధిస్తుంది.
ఇద్దరిని కాదని మా సభ్యులు జీవిత లేదా హేమాలకు ఓట్లు వేస్తారా ఏంటీ అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలో బుల్లి తెర కు చెందిన వారు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి ఉండటం మరింత చర్చ కు తెర తీస్తోంది.
ప్రకాష్ రాజ్ ప్యానల్ లో జబర్దస్త్ యాంకర్ అనసూయ మరియు సుడిగాలి సుధీర్ లు ఉన్నారు.వీరిద్దరు కూడా జబర్దస్త్ ఫ్యామిలీ అవ్వడం వల్ల వీరిద్దరు గెలవాలని వారి టీమ్ మొత్తం కోరుకుంటుంది.
ప్రస్తుతం చూస్తుంటే నాగబాబు మరియు చిరంజీవి తో పాటు ఇతరుల మద్దతు కూడా ప్రకాష్ రాజ్ కు ఉన్నట్లుగా తెలుస్తోంది.కనుక అనసూయ మరియు సుధీర్ లు ఈజీగా గెలుస్తారనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.
అనసూయ మరియు సుధీర్ లు ఈ మద్యే మా సభ్యత్వం తీసుకున్నారు.సుధీర్ హీరో గా చేస్తున్నాడు.అలాగే అనసూయ హీరోయిన్ గా మరియు క్యారెక్టర్ ఆర్టిస్టు గా చేస్తుంది.కనుక వీరిద్దరు మా సభ్యత్వం తీసుకున్నారు.
వీరు మా సభ్యత్వం తీసుకున్న తర్వాత వస్తున్న ఎన్నికలు అవ్వడం వల్ల పోటీకి సిద్దం అయ్యారు.
వీరి ఎంపిక వెనుక నాగబాబు ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.వీరికి నాగబాబు ఎంత సన్నిహితుడో అందరికి తెల్సిందే.అందుకే నాగబాబు స్వయంగా వీరిని ఏదో ఒక పదవికి తీసుకోమంటూ ప్రకాష్ రాజ్ కు సూచించడం ఆయన ఓకే చెప్పడం జరిగిందట.
జబర్దస్త్ టీమ్ మా ఎన్నికల్లో ఎంత వరకు సందడి చేస్తుంది అనేది చర్చనీయాంశంగా మారింది.