పవన్ కళ్యాణ్ మరియు క్రిష్ ల కాంబోలో రూపొందబోతున్న మూవీ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.సినిమా చిత్రీకరణకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది.
అయితే పవన్ జాయిన్ అయ్యేది ఎప్పుడు అనేది మాత్రం క్లారిటీ లేదు.ఈ సినిమా మొఘలాయిల కాలం నాటి కథతో రూపొందబోతుంది.
పవన్ దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు.పౌరాణిక సినిమా అయినా కూడా సినిమాలో రాజులు రాజ మందిరాలు భారీగా ఉండే అవకాశం లేదు.
కాని కొన్ని పాత్రలు మాత్రం అప్పటి పద్దతులను చూపించబోతున్నాయని అంటున్నారు.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో అనసూయ ఒక రాణి పాత్రలో కనిపించబోతుందట.
రాణి పాత్ర దాదాపుగా 30 నిమిషాల పాటు ఆన్ స్క్రీన్ ప్రజెన్స్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
నిధి అగర్వాల్ ను ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఎంపిక చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరో ముఖ్య పాత్రకు గాను జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఎంపిక చేయడం జరిగిందని అంటున్నారు.అయితే ఇప్పటి వరకు అధికారికంగా మాత్రం ప్రకటన వచ్చిందే లేదు.
వకీల్ సాబ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉండగా ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియుమ్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడు.ఆ సినిమా చిత్రీకరణ ఇటీవలే ప్రారంభం అయ్యింది.మొదటి షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే క్రిష్ దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని అంటున్నారు.
ఒకే సారి రీమేక్ మరియు క్రిష్ దర్శకత్వంలో సినిమాను పవన్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.ఈ రెండు సినిమాల విడుదల తేదీలు కూడా కాస్త అటు ఇటుగా ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.క్రిష్ ఈ ఏడాది మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు.