నేడు ఉదయం 6 గంటల సమయంలోనే జబర్దస్త్ యాంకర్ అనసూయ తన అభిమానులకు సోషల్ మీడియా ద్వారా బ్యాడ్ న్యూస్ ను షేర్ చేశారు.నేడు ఉదయం కర్నూలుకు ఒక అకేషన్ కోసం వెళ్తున్న సమయంలో కరోనా లక్షణాలు అనిపించాయి.
దాంతో వెంటనే టెస్టుకు సిద్దం అయ్యాను.నాలో కనిపించిన లక్షణాలు కరోనా పాజిటివ్ అయ్యి ఉంటాయి అని భావిస్తున్నాను.
అందుకే వెంటనే పరీక్ష చేయించుకున్నాను.పరీక్ష రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను.
నాతో గత వారం పది రోజులుగా కలిసిన వారు తప్పకుండా కరోనా పరీక్షలు చేయించుకోవడంతో పాటు ఇతరుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ విజ్ఞప్తి చేసింది.అనసూయ కరోనా పాజిటివ్ అంటూ క్లీయర్ గా అందులో పేర్కొనలేదు.
కాని ఆమె కు లక్షణాలు ఉన్నట్లుగా చెప్పడం వల్ల ఖచ్చితంగా ఆమెకు పాజిటివ్ రిపోర్ట్ వస్తుందని అంతా భావిస్తున్నారు.
ఇటీవల అనసూయ వరుసగా సంక్రాంతి కోసం ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తోంది.అక్కడ ఏమైనా ఈమెకు కరోనా పాజిటివ్ అంటి ఉంటుందా అంటూ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సండే ప్రత్యేక అకేషన్ కోసం వెళ్తున్న అనసూయకు ఇలాంటి పరిస్థితి కలుగడం ఆమె అభిమానులకు బాధ కలిగిస్తుంది.
అనసూయ త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేస్తున్నారు. పిల్లలు జాగ్రత్త అంటూ ఆమెకు కొందరు సూచిస్తున్నారు.ప్రస్తుతం బుల్లి తెరపై మరియు వెండి తెరపై ఈ అమ్మడు జోరు మామూలుగా లేదు.అలాంటీ అమ్మడుకి కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అయితే పలు షో లు నిలిచి పోవడంతో పాటు షూటింగ్ లకు కూడా బ్రేక్ ఇవ్వాల్సి వస్తుంది.
దాదాపుగా రెండు లేదా మూడు వారాల పాటు ఈ అమ్మడు అన్నింటికి దూరంగా ఉండే అవకాశం ఉంది.