ఆ వార్తలు పుకార్లే.. జాతిరత్నాలు దర్శకుడు క్లారిటీ ఇచ్చేశాడు

నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్‌ దర్శకత్వంలో రూపొందిన జాతి రత్నాలు సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న జాతి రత్నాలు సినిమా కు విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది.

 Jaathi Ratnalu Director Clarity On Hero Ram Movie  , Jaathi Ratnaalu, Naveen Pol-TeluguStop.com

షార్ట్‌ ఫిల్మ్‌ దర్శకుడు అనుదీప్‌ ఈ సినిమాను తెరకెక్కించాడు.భారీ అంచనాలున్న ఈ సినిమా తర్వాత అనుదీప్‌ ఫుల్‌ బిజీ అయ్యే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సమయంలోనే జాతి రత్నాలు దర్శకుడు అనుదీప్ కు ఆఫర్లు వరుసగా వస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇటీవలే ఎనర్జిటిక్ స్టార్ రామ్‌ తో ఈయన సినిమా ఖరారు అయ్యిందనే వార్తలు వచ్చాయి.

కాని తాజాగా జాతి రత్నాలు సినిమా ప్రమోషన్‌ లో భాగంగా దర్శకుడు అను దీప్ స్పందించాడు.ఇప్పటి వరకు తాను తదుపరి సినిమా విషయమై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.

తన వద్ద ఉన్న నాలుగు కథల్లో నుండి ఒక కథను అశ్వినీదత్ గారికి చెప్పాలనుకుంటున్నట్లుగా దర్శకుడు అనుదీప్ పేర్కొన్నాడు.తన తదుపరి సినిమా ను కూడా అశ్వినీదత్ గారి ఆశీర్వాదంతో స్వప్న సినిమా బ్యానర్‌ లోనే చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

అతి త్వరలోనే ఆ విషయమై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.పెద్ద ఎత్తున సినిమా ను విడుదల చేసే పనిలో ప్రస్తుతం అనుదీప్ ఉన్నాడు.

అంతకు మించి వేరే విషయాన్ని గురించి ఆలోచించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.రామ్‌ మరియు అనుదీప్ ల కలయికలో సినిమా అనుకున్న వారికి ఈ వార్త చేదు గా ఉండి ఉంటుంది.

నిప్పు లేనిదే పొగ రాదు అంటారు.కనీసం ఇద్దరి మద్య చర్చలు జరుగకుండానే ఎలా ఇలాంటి పుకార్లు వస్తున్నాయి అనేది కొందరి మాట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube