ఫరియా అబ్దుల్లా.ఈ అమ్మడి మొన్న మొన్నటి ఎవరు ఎవరికీ పరిచయం లేదు కానీ జాతి రత్నాలు సినిమాతో ఈ బ్యూటీ రాత్రికి రాత్రే ఫేమస్ అయ్యింది.
ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యింది.నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫరియా హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమాతోనే అమ్మడి క్రేజ్ అమాంతం పెరిగి పోయింది.ఈ సినిమాలో చిట్టి గా ప్రేక్షకుల గుండెల్లో నిలిచి పోయింది.
అమ్మడి అందం, కామెడీ టైమింగ్, నటన కట్టి పడేశాయి.ఈమె స్టార్ హీరోయిన్ అవ్వడం ఖాయం అని అంతా అనుకున్నారు కానీ ఈమెకు అనుకున్న అన్ని ఆఫర్స్ దక్కలేదు.
దీంతో చిన్నా చితక క్యారెక్టర్స్ వచ్చినా కాదనకుండా చేస్తూ ప్రేక్షకులు మర్చిపోకుండా తనని తాను నిరూపించు కుంటూ మరిన్ని అవకాశాల కోసం ఎదురు చూస్తుంది.
ఇటీవలే బ్యాచిలర్ సినిమాలో చిన్న రోల్ తో పాటు నాగార్జున బంగార్రాజు సినిమాలో ఒక ఐటెం సాంగ్ కూడా చేసింది.
ఇక ఆ తర్వాత ఈమె రవితేజ హీరోగా సుధీర్ వర్మ సర్సకత్వంలో తెరకెక్కుతున్న రావణాసుర సినిమాలో ఫి మేల్ లీడ్ రోల్ లో నటిస్తుంది.ఈ సినిమా చేస్తున్న క్రమంలోనే ఈ అమ్మడి లక్ ఇప్పుడు మారి ఏకంగా పాన్ ఇండియా సినిమాలో అవకాశాన్ని పట్టేసినట్టు టాక్ వినిపిస్తుంది.
విజయ్ ఆంటోనీ కొత్త సినిమాలో ఈ అమ్మడు ఆఫర్ కొట్టేసిందట.ఈయన నటించిన బిచ్చగాడు సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో అందరికి తెలుసు.ఈ సినిమా తర్వాతనే ఈయనకు తెలుగులో కూడా మార్కెట్ పెరిగింది.ఇక ఇప్పుడు విజయ్ 80లలో పెరియాడిక డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయబోతున్నాడట.
ఈ సినిమాలో హీరోయిన్ గా ఫరియా అవకాశం అందుకుందని వార్తలు వస్తున్నాయి.ఇదే నిజమైతే లక్కీ ఆఫర్ కొట్టేసినట్టే.