నవీన్ పొలిశెట్టి మెస్మరైజింగ్ నటనతో ఆరంభం నుండి అంతం వరకు కంటిన్యూస్ గా నవ్విస్తూనే ఉన్న జాతి రత్నాలు సినిమా హిట్ టాక్ దక్కించుకుంది.కథలో పట్టు లేదు స్టార్ కాస్టింగ్ అసలే లేదు.
అయినా కూడా సినిమా లో కావాల్సినంత వినోదం ఉన్న కారణంగా సినిమా ను ప్రేక్షకులు ఆధరిస్తున్నారు.కావాల్సినంత ఎంటర్ టైన్మెంట్ ను జాతి రత్నాలు అందిస్తున్న కారణంగా వారి పెట్టుబడికి పదింతల లాభాలను ప్రేక్షకులు అందిస్తున్నారు.
అయిదు కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే బ్రేక్ ఈవెన్ సాధించేసింది.మొదటి రోజు దాదాపుగా రూ.4 కోట్ల ను రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు కాస్త తగ్గి రూ.3 కోట్ల వరకు రాబట్టింది.మూడవ రోజు శనివారం వీకెండ్ అవ్వడంతో మళ్లీ దుమ్ము రేపింది.నాల్గవ రోజు అత్యధికంగా రూ. 4.5 కోట్ల రూపాయలను దక్కించుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు.సినిమా ఇప్పటికే దాదాపుగా రూ.11.5 కోట్ల ను రాబట్టింది.ఆది వారం అంటే నేడు మరో అయిదు కోట్ల వరకు ఈ సినిమా రాబడుతుందని అంటున్నారు.దాంతో సినిమా 16.5 కోట్ల వసూళ్లకు చేరుతుంది.లాంగ్ రన్ లో మరో 9 నుండి పది కోట్లు సాధించినా సినిమా పాతిక కోట్ల వరకు దక్కించుకున్నట్లుగా అవుతుంది.
సినిమాకు వచ్చిన క్రేజ్ నేపథ్యంలో దాదాపుగా 10 కోట్ల రూపాయలను ఈ సినిమా బిజినెస్ చేసింది.
ఇప్పటికే సినిమా బయ్యర్లు లాభాల బాట పట్టారు.చాలా కాలం తర్వాత అతి తక్కువ సమయంలో బ్రేక్ ఈవెన్ దక్కించుకున్న సినిమాగా జాతి రత్నాలు నిలిచింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
జాతి రత్నాలు సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్న నేపథ్యంలో ప్రేక్షకులు మొదటి నుండే భారీ అడ్వాన్స్ బుకింగ్ కు సిద్దం అయ్యారు.సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకోవడంతో ఆ అడ్వాన్స్ బుకింగ్ కంటిన్యూ అవుతూనే ఉంది.
ముందు ముందు మరెన్ని నెంబర్ లను ఈ సినిమా చూస్తుందో చూడాలి.