నవీన్ పొలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన నాగ్ అశ్విన్ నిర్మించిన జాతి రత్నాలు రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ సినిమా చిన్న సినిమా గా రూపొందినా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్ల భారీ బడ్జెట్ సినిమా రేంజ్ లో బిజినెస్ చేసింది.
సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ను పది కోట్ల లోపు బడ్జెట్ తోనే రూపొందించారు.కాని ఈ సినిమా మాత్రం ఏకంగా పాతిక కోట్ల వరకు బిజినెస్ చేసినట్లుగా సమాచారం అందుతోంది.థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపుగా రూ.15 కోట్ల ను రాబట్టింది.నవీన్ పొలిశెట్టి చేసిన రెండు సినిమా లు కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు సినిమా ను నవీన్ తనదైన శైలిలో ప్రమోట్ చేశాడు.
ప్రస్తుతం ఉన్న సినిమాల్లో జాతి రత్నాలు బెస్ట్ అన్నట్లుగా మేకర్స్ కూడా అందరికి అభిప్రాయం కలిగించేలా ప్రమోట్ చేసిన కారణంగా భారీ ఎత్తున క్రేజ్ ఏర్పడింది.
ఆ క్రేజ్ నేపథ్యంలో పెద్ద మొత్తానికి సినిమాను అమ్మేశారు.ఈజీగా సినిమా 15 కోట్లను రాబట్టగలదా అంటే అనుమానమే అన్నట్లుగా కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు.కాని కొందరు మాత్రం ఖచ్చితంగా జాతి రత్నాలు సినిమా పైసా వసూల్ సినిమా అంటున్నారు.అంటే పెట్టిన పెట్టుబడికి నిర్మాతకు లాభాలు తెచ్చి పెట్టడంతో పాటు టికెట్ రేటుకు చిత్రం చూసిన ప్రేక్షకులకు ప్రయోజనం కలిగిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
మొత్తానికి జాతి రత్నాలు సినిమా మరో రేంజ్ లో ఉంటుందని దీంతో క్లారిటీ వచ్చింది.ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టితో కలిసి రాహుల్ రామకృష్ణ మరియు ప్రియదర్శిలు చేసే కామెడీ సినిమా కు హైలైట్ గా నిలుస్తుంది.
ప్రభాస్ మరియు విజయ్ దేవరకొండ లు ఈ సినిమా ప్రమోషన్ కు హెల్ప్ అయ్యారు.సినిమా బజ్ విపరీతంగా ఉంది.
మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.