యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత కలిసి నటించిన రీసెంట్ మూవీ జాను ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.తమిళంలో సూపర్ సక్సెస్ అయిన 96 చిత్రానికి రీమేక్గా వచ్చిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపించడంతో ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందా అని అందరూ అనుకున్నారు.
కాగా ఈ సినిమా చాలా బోరింగ్గా ఉండటంతో తెలుగు జనాలకు ఈ సినిమా ఎక్కలేదు.
దీంతో ఈ సినిమా కమర్షియల్ పరంగా చాలా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది.ఈ సినిమా టోటల్ రన్లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.8.18 కోట్లు మాత్రమే వసూలు చేసింది.అయితే ప్రీరిలీజ్ బిజినెస్లో ఈ సినిమాను ఏకంగా రూ.21 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేయడంతో వారు భారీ నష్టాలను చవిచూశారు.
ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన ప్రేమ్కుమార్ తెలుగులోనూ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.ఇకఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ రన్లో వసూలు చేసిన కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 2.83 కోట్లు
సీడెడ్ – 0.88 కోట్లు
నెల్లూరు – 0.24 కోట్లు
కృష్ణా – 0.57 కోట్లు
గుంటూరు – 0.62 కోట్లు
వైజాగ్ – 0.93 కోట్లు
ఈస్ట్ – 0.50 కోట్లు
వెస్ట్ – 0.36 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 6.93 కోట్లు
రెస్టాఫ్ ఇండియా – 0.50 కోట్లు
ఓవర్సీస్ – 0.75 కోట్లు
టోటల్ వరల్డ్వైడ్ – 8.18 కోట్లు
.