యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి మరియు సాహో చిత్రాలతో ఆల్ ఇండియా స్టార్ హీరో అయ్యాడు.రెండు సినిమాలు కూడా ప్రభాస్ క్రేజ్ను అమాంతం పెంచేశాయి.
రికార్డు స్థాయిలో ఈ సినిమాలు వసూళ్లు రాబట్టాయి.దాంతో ఆయన తదుపరి చిత్రం గురించి ప్రస్తుతం సినీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా సినిమా దుము రేపే విధంగా జాన్ను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాను కృష్ణం రాజు నిర్మిస్తున్నాడట.
సినిమా ప్రారంభం అయ్యి సంవత్సరం ఎప్పుడో పూర్తి అయ్యింది.కాని ఇప్పటి వరకు కనీసం సినిమాకు సంబంధించిన ఫస్ట్లుక్ కూడా రాలేదు.సినిమా ఎప్పుడు వస్తుందనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు.ఎట్టకేలకు సినిమాకు సంబంధించిన విషయాలు మెల్ల మెల్లగా చిత్ర యూనిట్ సభ్యులు రివీల్ చేసేందుకు సిద్దం అయ్యారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం కొత్త సంవత్సరం కానుకగా ఈ సినిమా ఫస్ట్లుక్ను విడుదల చేయబోతున్నారట.ఇప్పటికే అందుకోసం కొన్ని స్టిల్స్ను కూడా సెలక్ట్ చేయడం జరిగిందట.
ఇక తెలుగు వారికి చాలా ప్రముఖమైన సంక్రాంతి పండుగ కానుకగా జాన్ సినిమా టీజర్ను విడుదల చేసే ఉద్దేశ్యంలో ఉన్నారట.ప్రభాస్కు సంక్రాంతి అంటే చాలా ఇష్టం.ఆ పండగ కానుకగా అభిమానులకు కానుక ఇవ్వాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.తప్పకుండా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యేలా ఉందంటూ ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.
ఈ చిత్రంలో ప్రభాస్కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తున్న విషయం తెల్సిందే.టీజర్లో సినిమా విడుదల విషయమై కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది
.