నిజం.కొన్ని కొన్ని సార్లు ఎవరైతే సృష్టించి ఉంటారో వాళ్ళకు కూడా తెలిసి ఉండదు.ఆ వస్తువును అలా వాడాలి అని.ఆ వాడే విధానాన్ని చూసి.ఏంటి వస్తువును ఇలా కూడా ఉపయోగిస్తారా? అబ్బో అని ఆశ్చర్యపోతారు.అలా జేసీబీని కనిపెట్టిన వ్యక్తే ఆశ్చర్య పోయే విధంగా ఆ జేసీబీని వాడి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఎవరైనా జేసీబీని ఎందుకు ఉపయోగిస్తారు? సాధారణంగా అయితే మట్టి తవ్వకాలకు, ఇళ్లను కూల్చడానికి, బండరాళ్లను ఎత్తడానికి, ఇంకా అనేక పనులకు ఉపయోగిస్తుంటారు.కానీ గుజరాత్ లో మాత్రం డీసీఎం వాహనంలో ఉన్న కొందరు మహిళలను అక్కడ నుండి దిగడానికి జేసీబీని ఉపయోగించారు.
ఇందు సంబందించిన ఓ వ్యక్తి.”జేసీబీని కనిపెట్టిన వ్యక్తి బహుశా ఎప్పుడు ఇప్పటిదాకా గుజరాత్లో పర్యటించి ఉండకపోవచ్చు.తన ఆవిష్కరణలను ఇలా ఉపయోగించుకుంటారని ఎన్నడూ ఊహించకపోవచ్చు అంటూ ట్విట్ చేశాడు.ఆ ట్విట్ ను చుసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆ ట్విట్ ను రీట్వీట్ చేస్తూ.”ఆవిష్కరణలకు ప్రజలు మార్పులు చేస్తే అటువంటి ఆవిష్కరణలు మరింత అద్భుతంగా ఉంటాయి” అంటూ ట్విట్ చేశారు.దీంతో ఈ ట్విట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.