చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేసిన ఐవైఆర్..!!

నిన్న చంద్రబాబు తిరుమల తిరుపతి లో ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ముందుగా స్వామివారిని దర్శించుకున్న చంద్రబాబుటీటీడీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం జరిగింది.

 Ivr Krishna Rao Serious Comments On Chandrababu,  Ys Jagan, Tirupathi, Ivr Krish-TeluguStop.com

రమణదీక్షితులు ముఖ్యమంత్రి వైయస్ జగన్ ని విష్ణుమూర్తితో పోల్చడాన్ని చంద్రబాబు తప్పు పట్టడం జరిగింది.మనిషి ఎప్పుడూ దేవుడు కాడు అని నిమిత్తమాత్రుడు దేవునితో పోల్చకూడదు అంటూ రమణదీక్షితులు కౌంటర్ వేశారు.

ఈ క్రమంలో తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని స్పష్టం చేశారు.ఈ గ్రామంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోషల్ మీడియాలో స్పందించారు.

చంద్రబాబు చేసిన కామెంట్లకు సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ని పోస్ట్ చేసి ఈ విధంగా కామెంట్ పెట్టారు.నిజమే.రమణ దీక్షితులు గారి వ్యాఖ్యలు గర్హనీయం, ఖండించి దగినవి.కానీ, దేవాలయ వ్యవస్థను భ్రష్టు పట్టించి, అర్చకులను రోడ్డుపై పడేసిన తమరికి, తమ పార్టీకి మాత్రం ఈ విషయంలో విమర్శించే నైతిక హక్కు లేదు.

మిగిలిన అందరికీ ఉంది.ఈనాటి పరిస్థితికి ప్రధాన బాధ్యత తమరు, తమ పార్టీయే.మరిచిపోరాదు’ అని ఐవైఆర్ కృష్ణారావు పోస్ట్ పెట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube