సినీ నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్(Bandla Ganesh) ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసే ట్వీట్ల కారణంగా సంచలనంగా మారుతున్నారు.గత రెండు రోజుల నుంచి ఈయన సోషల్ మీడియాలో పరోక్షంగా గురూజీ అంటూ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) ను ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి ఈట్వీట్స్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
ఇండస్ట్రీలో నిర్మాతగా మారాలి అంటే ఈ గురూజీకి కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తే చాలు అంటు కామెంట్స్ చేశారు.అంతే కాకుండా ఎవరినైనా విడగొట్టాలంటే ఈ గురూజీకి మించిన వారు లేరంటూ పరోక్షంగా గురూజీ అంటూనే త్రివిక్రమ్ గురించి ఈయన ట్వీట్ చేశారు.
ఇలా గురించి అంటూ త్రివిక్రమ్ శ్రీనివాస్ ను టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ చేస్తున్నటువంటి ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే ఇప్పటికీ ఈయన గురూజీని వదలడం లేదని తెలుస్తోంది.అయితే తాజాగా నేడు ఉదయం బండ్ల గణేష్ మరొక ట్వీట్ ద్వారా సంచలనం సృష్టించారు.సాగినంత కాలం నా అంత వాడు లేడందురు సాగకపోతే ఊరక చతికిల పడిపోవదురు.
చెప్పడమే నా ధర్మం.వినకపోతే నీ ఖర్మ.
గురూజీ అంటూ ట్వీట్ చేశాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక్కడితో ఆగకుండా బండ్ల గణేష్ మరొక ట్వీట్ చేస్తూ.భక్తుడికి భగవంతుడికి మధ్య అనుసంధానమైనది అంబికా దర్బార్ అగరబత్తి… భగవంతుడికి భక్తుడిని దూరం చేసేది గురూజీ దర్బార్ సుత్తి అంటూ ఈ సందర్భంగా బండ్ల గణేష్ మరొక ట్వీట్ చేశారు.ఇలా ఈయన వరుసగా ట్విట్టర్ వేదికగా గురూజీని ఉద్దేశిస్తూ చేస్తున్నటువంటి ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అయితే త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు విని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బండ్ల గణేష్ ను దూరం పెడుతున్నారన్న కారణంతోనే ఈయన పరోక్షంగా త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ ఈ విధమైనటువంటి ట్వీట్స్ చేస్తున్నారని అర్థమవుతుంది.
మరి ఈ గురూజీ దండకం బండ్ల గణేష్ ఎప్పుడు ఆపుతారో తెలియాల్సి ఉంది.