టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన రష్మిక మందన్నా తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించారు.హీరోయిన్ గా కెరీర్ ను మొదలుపెట్టినప్పటి నుంచి ట్రావెలింగ్ తన లైఫ్ లో భాగమైందని రష్మిక తెలిపారు.
ఒక విధంగా చెప్పాలంటే ప్రయాణాలు చేయడమే తన జీవితమైందని రష్మిక చెప్పుకొచ్చారు.ఇప్పుడు తనకు ముంబైలో ఇల్లు ఉందని ఆమె పేర్కొన్నారు.
రోజులో షూటింగ్ పూర్తైన తర్వాత హోటల్స్ లో ఉండటానికి బదులుగా ఇంటికి వెళ్లి ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె చెప్పుకొచ్చారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో మిషన్ మజ్ను సినిమాతో రష్మిక మందన్నా కెరీర్ ను మొదలుపెట్టనున్నారు.ఈ సినిమా రిలీజ్ కావడనికి ముందే కన్నడ కస్తూరి రష్మికకు గుడ్ బై మూవీలో ఆఫర్ దక్కింది.2021 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ముంబైలో రష్మిక ఇంటిని కొనుగోలు చేశారు.
తాను సొంతంగా ఆ ఇంటికి ఇంటీరియర్ డిజైన్ చేశానని రష్మిక తెలిపారు.తనకు, తన సిస్టర్ కు మధ్య ఏజ్ గ్యాప్ 16 సంవత్సరాలు అని ఒక విధంగా తాను తన చెల్లెలికి రెండో అమ్మనని రష్మిక పేర్కొన్నారు.అమితాబ్ బచ్చన్ తో సినిమా చేస్తున్నానని చెప్పగానే ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారని రష్మిక చెప్పుకొచ్చారు.లాక్ డౌన్ లో అమ్మానాన్నలు కూర్గ్ లో ఉంటే తాను హైదరాబాద్ లో ఉండిపోవాల్సి వచ్చిందని రష్మిక వెల్లడించారు.
హిందీలో గతంలో కూడా చాలా కథలు విన్నా తనకు నచ్చలేదని రష్మిక చెప్పుకొచ్చారు.కూర్గ్ కు వెళ్లే సమయంలో గుడ్ బై కథ వినగా ఆ కథ తనకు ఎంతగానో నచ్చిందని రష్మిక పేర్కొన్నారు.రష్మిక తెలుగులో పుష్ప సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.