సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా ఎప్పుడో సెట్స్ మీదకు వెళ్లాల్సి ఉండగా చాలా కారణాల వల్ల వెళ్లలేక పోయింది.
ఇక ఈ మధ్యనే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేసారు.మహేష్ బాబుపై యాక్షన్ సన్నివేశాలను త్రివిక్రమ్ చిత్రీకరించాడు.
ముందు యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేసాకనే అప్పుడు మిగతా పార్ట్ పూర్తి చేయనున్నాడు త్రివిక్రమ్.
ఈ సినిమా షూట్ హైదరాబాద్ లో స్టార్ట్ అవ్వగా విరామం లేకుండా షూటింగ్ పూర్తి చేయాలనీ త్రివిక్రమ్ అనుకున్నాడు.
అలాగే మొదటి షెడ్యూల్ అయితే ఎటువంటి విరామం లేకుండా పూర్తి చేసాడు.రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాటు చేసిన భారీ సెట్ లో యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించాడు.
ఇక దసరా తర్వాత మరొక షెడ్యూల్ స్టార్ట్ చెయ్యాలని అనుకున్నారు.
కానీ ఈ లోపులోనే మహేష్ బాబు మదర్ ఇందిరా దేవి గారు మరణించడంతో మహేష్ 20 రోజుల పాటు షూట్ కు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తుంది.
ఇక త్రివిక్రమ్ కూడా నెక్స్ట్ షెడ్యూల్ ఎలా ప్లాన్ చేయాలా అనే విషయంలో బిజీగా ఉన్నాడు.ఇది ఇలా ఉండగా ఈయన ఒక సెంటిమెంట్ ను బ్రేక్ చేయాలని అంతా బలంగా కోరుకుంటున్నారు.
మరి త్రివిక్రమ్ మొదటి నుండి కూడా సెంటిమెంట్స్ ను బాగా ఫాలో అవుతాడు.
అయితే ఈయన సినిమాల్లో ఐటెం సాంగ్ మాత్రం ఇప్పటి వరకు లేదు.కానీ మహేష్ ఫ్యాన్స్ ఈసారి స్పెషల్ సాంగ్ ఉండాల్సిందే అని ఆయనను కోరుతున్నారు.ఈ క్రమంలోనే నిర్మాత నాగవంశీ కూడా ఐటెం సాంగ్ గురించి త్రివిక్రమ్ తో మాట్లాడి ఆయనకు విజ్ఞప్తి చేసినట్టు తెలిపాడు.
ఇక ఆయన కూడా ఆలోచనలో పడ్డట్టు తెలుస్తుంది.మరి ఇన్నేళ్లకు త్రివిక్రమ్ తన సినిమాలో ఐటెం సాంగ్ ను యాడ్ చేస్తాడో లేదో చూడాలి.
ఇక ఈ మూవీలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా.హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఎలాగైతేనేం అభిమానుల కోరిక తీరింది.
త్రివిక్రమ్ ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.