చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని కూడా చేరింది.200 లకు పైగా దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లుగా సమాచారం అందుతోంది.అయితే మొదట ప్రారంభం అయిన చైనా కంటే అధికంగా ఇప్పుడు ఇటలీ ఇంకా అమెరికా దేశాలు ప్రభావం అవుతున్నాయి.ఇటలీలో కరోనా మృతుల సంఖ్య ఇప్పటికే పదివేలు దాటింది.
ఈ సంఖ్య ఎంతకు చేరుతుందో అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.
ఇటలీలో కరోనా పాజిటివ్ల సంఖ్య అంతకంతకు పెరుగుతున్న సమయంలో అక్కడ జనాలు ఫ్రస్టేషన్కు వచ్చేశారు.
తాము బతుకుతామో లేదో అన్న ఆందోళన మొదలైందట.ఒక అంతర్జాతీయ మీడియా సంస్థ కథనం ప్రకారం ఇటలీలో జనాలు ప్రాణాలపై ఆశ వదులుకున్నారట.
అక్కడి ప్రభుత్వం కూడా చేతులు ఎత్తేసిందట.ఈ సమయంలో జనాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం, రాబరీలు చేయడం వంటివి చేస్తున్నారట.
ఇది ముందు ముందు మరింతగా పెరిగే ప్రమాదం ఉందని అంటున్నారు.