నల్గొండలోని మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో 20 మంది ఐటీ అధికారులు అర్థరాత్రి 12 గంటల వరకు సోదాలు జరిపారు.రూ.49 లక్షలు స్వాధీనం చేసుకోవడంతో పాటు పలు డాక్యుమెంట్స్ సీజ్ చేశారు.సోదాల్లో స్థానిక పోలీసు అధికారులను కూడా లోపలికి వెళ్లకుండా ఐటీ అధికారులు కట్టడి చేశారు.
మునుగోడు ఎన్నికలకు రెండు రోజుల ముందు ఐటీ సోదాలు జరగడంతో రాజకీయంగా మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది.