ముంబైలో పలువురు సినీ నటులు, డైరెక్టర్ల ఇళ్లపై ఐటీ బృందాలు బుధవారం ఆకస్మిక దాడులు జరపడంతో ఒక్క సారిగా బాలీవుడ్ చిత్రపరిశ్రమ ఉలిక్కి పడిందట.కాగా ఫాంటోమ్ ఫిల్మ్స్ అనే సంస్థ ట్యాక్స్ ఎగ్గొట్టినట్లు ఆరోపణలు రావడంతో ఆ సంస్థతో సంబంధం ఉన్న నటులు, డైరెక్టర్ల ఇళ్లల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు ప్రచారం. ఇకపోతే ఆదాయపన్ను శాఖ అధికారులు బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ నివాసాలపైనే గాక ఫాంటమ్ ఫిలింస్ కార్యాలయంతో సహా ముంబై, పుణేలో లాంటి దాదాపు 22 ప్రదేశాలలో ఈ సోదాలు జరుగుతున్నాయట.ఇక బాలీవుడ్ నిర్మాత వికాస్ బాహెల్ ,మధు మంతేనా, శిభాషిష్ సర్కార్, అఫ్సర్ జైదీ, విజయ్ సుబ్రమణ్యం ఇంటిపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారట ఆదాయపన్ను శాఖ అధికారులు.
ఇకపోతే కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులకు కశ్యప్, బాహెల్, తాప్సీ మద్దతు ఇస్తున్న నేపధ్యంలో ఈ దాడులు కలకలాన్ని రేపుతున్నాయంటున్నారట పలువురు.