దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడిలో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి.ఇక ఈ ఎన్నికలలో ధన ప్రవాహం భారీగా ఉండబోతుంది అని ఇప్పటికే రాజకీయ మేధావులు స్పష్టం చేసారు.
ఈ రాజకీయలో అన్ని పార్టీలు గెలుపే లక్ష్యంగా వేల కోట్ల రూపాయిలు ప్రజలపై ఖర్చు పెట్టడానికి సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు కూడా ఇప్పటి వరకు కూడబెట్టిన నల్లదనం బయటకి తీసే పనిలో ఉన్నారు.
దీంతో ఇప్పటికే పోలీసుల దాడులలో వందల కోట్ల రూపాయిలు పట్టుబడుతున్నాయి.
ఈ నేపధ్యంలో ఐటీ అధికారులు కూడా రాజకీయ నాయకులపై ప్రత్యేక ద్రుష్టి పెట్టారు.
నేతలు అవినీతి, నల్లదనం మొత్తం ఇప్పుడు బయటకి తీస్తున్నారని తెలుసుకున్న ఐటీ అధికారులు దాడులు తీవ్రతరం చేసాయి.ఇప్పటికే ఏపీలో అధికార పార్టీకి చెందిన నేతలపై దాడులు చేసిన సంగతి తెలిసిందే.తాజాగా దేశవ్యాప్తంగా ఆదివారం జరిగిన ఐటీ దాడులు చేసారు.50 ప్రాంతాల్లో సుమారు 300 మంది ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ అనుచరుడు, ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి.
అదే విధంగా ముఖ్యమంత్రి మరో ప్రధాన అనుచరుడు ఆర్కే మిగ్లానీ నివాసంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి.ఒక్క డిల్లీలోనే 35 ప్రాంతాల్లో ఈ దాడులు నిర్వహిస్తున్నారు.ఇప్పటికి 9కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
దీంతోపాటు భోపాల్లోని రతుల్ పురి, అమైరా గ్రూప్ అండ్ మోసర్ బేయర్లలో, ఇండోర్, గోవా తదితర ప్రాంతాల్లో ఆ దాడులు కొనసాగుతున్నాయి.ఇక ఎన్నికలలో అక్రమ డబ్బు సరఫరాని అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ దాడులు చేస్తున్నట్లు తెలుస్తుంది.
తాజా వార్తలు