తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు ఐటీ లేఖ రాసింది.మంత్రి మల్లారెడ్డి అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సోదాలకు సంబంధించిన పూర్తి నివేదికతో ఈడీకి ఐటీ అధికారులు లేఖ రాశారని సమాచారం.ఇప్పటివరకు సేకరించిన సాక్ష్యాలను లేఖలో పేర్కొన్నారు.
మల్లారెడ్డికి సంబంధించిన మెడికల్ సీట్లు, డొనేషన్ల విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.ఈ క్రమంలో మల్లారెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని ఐటీ భావిస్తోంది.
అదేవిధంగా మనీ లాండరింగ్ కోణంలోనూ దర్యాప్తు జరపాలని ఐటీ లేఖలో కోరింది.ఈడీ దర్యాప్తు జరిగితే మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని ఐటీ తెలిపింది.