నేనే రాజు నేనే మంత్రి ఇ అన్నట్టుగా తెలంగాణలో పరిపాలన చేసుకుంటూ తనకు ఎదురు లేకుండా వరుస విజయాలతో ముందుకు వెళ్తున్న కెసిఆర్ ప్రభుత్వానికి ఇప్పుడు ఐటీ శాఖ ఝలక్ ఇచ్చింది.ఆ పార్టీలో ఉన్న కీలక నాయకులు, మంత్రులకు నోటీసులు జారీ చేసింది.
ఈ నోటీసులు అందుకున్న వారిలో మంత్రులు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉండడంతో టిఆర్ఎస్ ఇప్పుడు బెంబేలెత్తిపోతోంది.ఇంతకీ ఐటీ శాఖ ఈ నోటీసులు జారీ చేయడం గల కారణాలు ఏంటి అంటే మూడు సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన ‘గులాబీ కూలి’ అనే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలు లెక్కలు చెప్పాలంటూ ఈ నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.
నోటీసులు అందుకున్న వారిలో కేటీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ తదితరులు ఉన్నట్టుగా తెలుస్తోంది.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేయడంతో ఐటీ శాఖ రంగంలోకి దిగి ఈ నోటీసులు జారీ చేసినట్లుగా సమాచార.టిఆర్ఎస్ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా మూడు సంవత్సరాల క్రితం ప్రగతి నివేదన సభను నిర్వహించింది.ఆ సందర్భంగా గులాబీ కూలి పేరుతో సభకు హాజరయ్యే కార్యకర్తల కోసం టిఆర్ఎస్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు ఉత్తుత్తి కూలిపనులు చేసి లక్షల రూపాయలు సంపాదించారని, అందుకే ఐటీ శాఖ నుంచి ఈ విధంగా నోటీసు వచ్చినట్లు సమాచారం.
అధికార పార్టీ టిఆర్ఎస్ నిధులు దుర్వినియోగం చేసేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టింది అంటూ అప్పట్లో ఆయన అనేక కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేశారు.దీంతో ఐటి శాఖ ఆ కార్యక్రమంలో భాగస్వామ్యం ఉన్న నాయకులు ఒక్కొక్కరికి నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ వ్యవహారాన్ని బయటకి పొక్కకుండా టిఆర్ఎస్ పార్టీ జాగ్రత్తలు పడుతోంది.
దీనిపైనా ఇప్పటివరకు ఆ పార్టీ నాయకులు ఎవరూ స్పందించలేదు.ఐటీ నోటీసులకు ఏ సమాధానం చెప్పాలి ? అనే దానిపైన టీఆర్ఎస్ నాయకులు మథనపడుతున్నట్టు తెలుస్తోంది.