టీడీపీ ఎమ్మెల్సీ ఆస్తులపై ఐటీ దాడులు !

గత కొద్ది రోజుల క్రితం ఏపీలో టీడీపీ ప్రజాప్రతినిధులే లక్ష్యంగా ఐటీ దాడులు పెద్ద ఎత్తున జరిగాయి.ఈ దాడుల్లో ఎన్నో కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న అధికారులు కొంతమందికి నోటీసులు కూడా పంపించారు.

 It Attacks On Tdp Mlc Magunta Srinivasareddy Companies-TeluguStop.com

ఇక తెలంగాణాలో ఎన్నికల తంతు పూర్తవ్వడంతో ఇప్పుడు మళ్ళీ ఏపీలో ఐటీ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.

తాజాగా…నెల్లూరులో ఒంగోలు మాజీ ఎంపీ, టీడీపీ నేత, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి చెందిప కంపెనీలపై ఆదాయపన్నుశాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు… మాగుంట కుటుంబానికి చెందిన కంపెనీలపై నిన్నటి నుంచి ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి… చెన్నై టి.నగర్ లోని కార్పొరేట్ కార్యాలయంతో పాటు పూనమల్లి రోడ్ లోని ఫ్యాక్టరీపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు.ఇక చెన్నైలో నెల్లూరుకు చెందినవారికి సంబంధించిన సవేరా హోటల్ లోని ప్రైవేట్ లాకర్లలో పెద్ద ఎత్తున బంగారం, నగదు నిల్వలు దా చిపెట్టినట్టు ఐటీ అధికారులకు సమాచారం ఉన్నట్టు తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube