తెలుగమ్మాయి అయిన మొదటిగా తమిళ సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి ఐశ్వర్య రాజేష్.ఒకప్పటి నటుడు రాజేష్ కూతురైన ఈ భామ తమిళ సినిమాలతో తెరంగేట్రం చేసి అక్కడ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకోవడంతో పాటు స్టార్ హీరోలతో నటించింది.
విక్రమ్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో కూడా ఆడిపాడిన ఈ భామ ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల మీద దృష్టిపెట్టింది.తెలుగులో ఆమె చేసిన మొదటి సినిమా కౌశల్య కృష్ణమూర్తి ఈ సినిమా నటిగా ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
దీని తర్వాత మిస్ మ్యాచ్ అనే సినిమాలో అంటించింది.ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నలుగు హీరోయిన్స్ లో ఒకరుగా ఐశ్వర్య రాజేష్ నటిస్తుంది.దీంతో పాటు ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ప్రారంభమైన టక్ జగదీశ్ సినిమాలో కూడా హీరోయిన్ గా ఫైనల్ అయ్యింది.
ఇదిలా ఉంటె తాజాగా ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది.నేను తెలుగమ్మాయి అయిన తెలుగులో గ్లామర్ ప్రాత్రలకి ప్రాధాన్యత ఇవ్వడం వలన ముందుగా ఇక్కడ చేయలేకపోయాను.
అలాంటి పాత్రలకి తాను సరిపోను.నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి వాటి ప్రకారమే సినిమాలు చేస్తా అని చెప్పింది.
అలాగే ముద్దు సన్నివేశాలు కథలో భాగంగా ఉంటె చేయడానికి తనకి అభ్యంతరం లేదని స్పష్టం చేసింది.