ప్రపంచంలో కి కొత్త టెక్నాలజీ తీసుకురావాలన్న అదేరీతిలో శత్రువుల ఆట కట్టించాలి అన్నా.ముందుండే దేశం ఇజ్రాయిల్.
ప్రపంచంలోనే అతి చిన్న దేశం అయిన గాని దాని చుట్టుప్రక్కల అరబ్ దేశాలను .గజగజ లాడిస్తూ ఉంటది. అదే విధంగా కొత్త టెక్నాలజీ తో ఆయుధాలను తయారు చేయడంలో ఎప్పుడూ ముందు ఉంటది. ఈ రకంగానే శత్రువులు దేశ ప్రజలపై ప్రయోగించే యుద్ధ రాకెట్ లాంచర్ లను గాలిలోనే నిర్వీర్యం చేసే విధంగా.
ఐరన్ డోమ్.తీసుకువచ్చి చుట్టుప్రక్కల ఉగ్రవాదుల ఆటలను అరికడుతుంది.
కాగా ఇజ్రాయెల్ తాజాగా మరో కొత్త ఆయుధాన్ని దేశ సరిహద్దుల్లో భద్రత కోసం.అందుబాటులోకి తెచ్చింది.
విషయంలోకి వెళితే దేశ సరిహద్దుల్లో సైనికులు లేకుండానే భద్రత కోసం రోబోటిక్ వాహనాలను ఇజ్రాయేల్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.
ఈ రోబోటిక్ వాహనాల్లో రెండు మిషన్లు కెమెరాలు సెన్సార్లు అమర్చటం జరిగింది.
ఇజ్రాయిల్ ఏరోస్పేస్ దీనిని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.ఎలక్ట్రానిక్ ట్యాబ్ ద్వారా దీనిని కంట్రోల్ చేస్తారు.
తాజాగా ఈ సాయుధ రోబో టెక్నాలజీ కలిగిన వాహనాలను ఇజ్రాయేల్ ప్రభుత్వం సరిహద్దుల్లో భద్రత కోసం వినియోగించడానికి రెడీ అయ్యింది. చుట్టుపక్కల ప్రాంతాల నుండి.
రాకెట్ల దాడి ఎక్కువ కావడంతోపాటు సరిహద్దుల్లో పహారా కాసే ఇజ్రాయిల్ సైనికులతో ఇటీవల దాడులు ఎక్కువ కావటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.