కరోనా సమయంలో ఈ వైరస్కు విరుగుడు త్వరగా కనిపెడితే బాగుండునని ప్రపంచంలో ఎందరో భగవంతున్ని వేడుకున్నారు.తీరా కరోనాకు టీకా వచ్చినాక వేసుకోవడానికి భయపడుతున్నారు.
మన దేశంలో అయితే ఈ పక్రియ చాలా నత్తనడకన సాగుతుందని ప్రచారం జరుగుతుంది.
ఇంకా వ్యాక్సిన్ అందని దేశాల్లో మాత్రం అక్కడి ప్రజలు ఈ టీకా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.
ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల కంటే ఇజ్రాయెల్ లో కరోనా టీకాల కార్యక్రమం జోరుగా సాగుతోందట.
ఇక ఈ కరోనా వ్యాక్సిన్ ఇప్పటి వరకు 43 శాతం మందికి ఇచ్చారట.అంటే సుమారు 90 లక్షల జనాభా ఉన్న ఇజ్రాయెల్ లో ఇంత మందికి ఈ వ్యాక్సిన్ ఇవ్వడం చూస్తుంటే ఆక్కడి ప్రజలు కరోనా టీకా వేసుకోవడానికి భయపడటం లేదని అర్ధం.
ఈ నేపధ్యంలో మరింత మంది కరోనా టీకా వేసుకోవాలని ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లో ఉన్న జెనియా గాస్ట్రోపబ్ ఓ ఆఫర్ ప్రకటించింది.
కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే డ్రింక్స్ ఫ్రీ అంటూ ఊరిస్తోంది.ఈ క్రమంలో వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లు పబ్ లో ఉచితంగా డ్రింక్స్ తాగొచ్చు.అయితే అదీ ఆల్కహాల్ లేని డ్రింక్స్ మాత్రమే అందిస్తుందట.