భారతీయులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కుమారుడు యాయిర్ క్షమాపణలు చెప్పారు.దీని పూర్వాపరాల్లోకి వెళితే.
సోషల్ మీడియాలో యాక్టివ్గా వుండే యాయిర్ తన తండ్రికి సంబంధించి అవినీతి ఆరోపణలల్లో ప్రాసిక్యూటర్గా వ్యవహరిస్తున్న లియత్ బెన్ ఆరిపై అసహనం వ్యక్తం చేశాడు.దీనిలో భాగంగా తన ట్విట్టర్ దుర్గామాత ఫోటోను పోస్టు చేశాడు.
మామూలుగా చేసుంటే ఏ ఇబ్బంది ఉండేది కాదు.కానీ యాయిర్.దుర్గాదేవి తల వద్ద లాయర్ లియాత్ బెన్ అరి ఫోటోను సూపర్ ఇంపోజ్ చేశాడు.అంతేకాకుండా దుర్గాదేవి చేతుల్లోని మధ్యవేలిని ఎత్తిచూపుతున్నట్లు ట్వీట్ చేశాడు.
అలాగే అమ్మవారు కూర్చున్న పులి తలను అటార్నీ జనరల్ అవిచాయి మండెల్బిట్ ఫోటోతో మార్ఫింగ్ చేశాడు.‘‘నీచమైన వ్యక్తులు మీ స్థానాన్ని తెలుసుకోండి అంటూ కామెంట్ పెట్టాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయ్యింది.
దుర్గాదేవి ఫోటో అభ్యంతరకరంగా ఉండటంతో భారతీయులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు.దీంతో యాయిర్ తన ట్వీట్ను తొలగిస్తూ క్షమాపణలు చెప్పారు.తాను ఇజ్రాయెల్లోని రాజకీయ నాయకులను ఉద్దేశిస్తూ ట్వీట్ చేశానని.
అయితే అది భారతీయుల ఆరాధ్య దైవం దుర్గాదేవి అనే విషయం తనకు తెలియదని యాయిర్ పేర్కొన్నాడు.తాను చేసిన తప్పుపై పలువురు భారతీయ మిత్రులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకురావడంతో ఈ ట్వీట్ను వెంటనే తొలగించినట్లు చెప్పాడు.
తాను చేసిన తప్పుకు గాను భారతీయ హిందువులంతా క్షమించాలని ట్వీట్ చేశాడు.ఓ సెటైర్ పేజీ నుంచి ఈ ఫోటోను తీసుకుని ట్వీట్ చేశానని, ఇజ్రాయెల్లో రాజకీయ నేతల్ని తాను విమర్శించినట్లు యాయిర్ తెలిపాడు.
కాగా, యాయిర్ గతంలో కూడా ఓ పాత్రికేయుడిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు.