ఇన్ని రోజులుగా ప్రపంచ దేశాలు కరోనా వైరస్ ని కట్టడి చేయగల వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూశాయి.అయితే ఈ టీకా అందుబాటులోకి వచ్చింది అన్న సంగతి మనకు తెలిసిందే.
కానీ ఈ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజల్లో అనేక అనుమానాలు, భయాలు కలుగుతున్నాయి.ఇక భారత్లో చూసుకుంటే ఈ వ్యాక్సినేషన్ ప్రారంభమయ్యింది.
ఇక వ్యాక్సినేషన్ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.అలాగే 18 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వాలి.
గర్భిణీలకు బాలింతలకు వ్యాక్సిన్ ఇవ్వకూడదని స్పష్టం చేసింది.
ఇక ఈ వ్యాక్సిన్ ను ఫైజర్ అని పిలుస్తున్నారు.
భారత్లో ఇలా ఉండగా ఇజ్రాయెల్ లో మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది.అక్కడి ప్రజలు వ్యాక్సిన్ తీసుకున్నవారు భయాందోళనకు గురవుతున్నారు.
ఇంతకీ ఏం జరిగింది తెలుసుకుందాం.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ లో కరోనా వ్యాక్సిన్ మొదలయింది.
ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కోవిడ్ పాజిటివ్ గా రావడం సంచలనం రేపుతోంది.వ్యాక్సిన్ వేసుకున్న వారిలో 12 వేల మందికి పైగా కరోనా వైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.2020 డిసెంబర్ 19న ఇజ్రాయెల్ లో కరోనా వ్యాక్సిన్ నేషన్ మొదలయింది.అయితే ఈ వ్యాక్సిన్ వృద్ధులకు,హెల్త్ రిస్క్ ఎక్కువ ఉన్నవారికి,అత్యవసర సిబ్బందికి మాత్రమే ఈ వ్యాక్సిన్ వేశారు.
ఇజ్రాయెల్ లో 1,89,000 మరోసారి కోవిడ్ టెస్ట్ నిర్వహించగా 12,400 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.అనగా 6.6 శాతం మంది జనాభాకు కరుణ పాజిటివ్ గా రావడం కలకలం రేపుతోంది.అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరిలో 69 మందికి సెకండ్ డోస్ ఇవ్వడం కూడా జరిగింది.
అయితే తాము ఊహించిన దానికన్నా ఫైజర్ వ్యాక్సిన్ చాలా తక్కువ సామర్థ్యం కలిగి ఉందని నేషనల్ కో ఆర్డినేటర్ ఆన్ పాండమిక్ అభిప్రాయపడ్డారు.అయితే కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ ఇచ్చినప్పటికీ వైరస్ వ్యాప్తి కంట్రోల్ కాలేదు.
దాంతో మూడోసారి లాక్ డౌన్ విధించారు.అయితే ఇప్పటికే ఇజ్రాయిల్ లో అర మిలియన్ కు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి.4,005 మరణించారు.