స్టార్ దర్శకుడు పూరి జగన్నాథ్ వరుస ఫ్లాప్ ల తర్వాత తిరిగి బౌన్స్ బ్యాక్ అయిన సినిమా ఇస్మార్ట్ శంకర్.ఈ సినిమాతో మళ్ళీ తన కెపాసిటీని పూరి టాలీవుడ్ కి పరిచయం చేశాడు.
తన స్టైల్ ఫార్ములాకి కథలో కొత్త పాయింట్ జోడించి ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ని పూరి ప్రెజెంట్ చేశాడు.ఇక రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ క్రింద ఈ సినిమా నిలబడింది.
ఇప్పటి వరకు క్లాస్ లుక్ లో కనిపించిన రామ్ ఒక్కసారిగా తనని తాను ఇస్మార్ట్ శంకర్ కోసం పూర్తిగా మార్చేసుకున్నాడు.ఈ సినిమాతో అతని మాస్ ఇమేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో ఫైటర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతుంది.
ఇప్పటికే ఈ సినిమా మెజారిటీ షూటింగ్ కంప్లీట్ అయిపొయింది.కరోనా పరిస్థితులు కంట్రోల్ లోకి వచ్చిన వెంటనే సింగిల్ షెడ్యూల్ లో ఫైటర్ మూవీ మొత్తం పూర్తి చేయడానికి పూరి ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఇంట్లో ఖాళీగా ఉంటున్న పూరి కథలపై పడ్డాడు.బాలయ్య కోసం ఒక కథని ఇప్పటికే సిద్ధం చేయగా, ఇప్పుడు ఇస్మార్ట్ సీక్వెల్ కథ కూడా రెడీ చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే డబల్ ఇస్మార్ట్ పేరుతో టైటిల్ కూడా రిజిస్టర్ చేసేశారు.ఇక ఈ సీక్వెల్ ని వచ్చే ఏడాది తెరపైకి తీసుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది.ఇప్పటికే రెడ్ మూవీ పూర్తి చేసిన రామ్ నెక్స్ట్ సినిమాని పూరితోనే చేయాలని ఫిక్స్ అయ్యి ఉన్నాడు.ఈ నేపధ్యంలో డబల్ ఇస్మార్ట్ ని వీలైనంత తొందరగా సెట్స్ పైకి ఎక్కించడానికి పూరి ప్లాన్ చేసుకుంటున్నారు.
త్వరలో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.