రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం నేడు ప్రేక్షకుల రాబోతుంది.అదేంటి ఇస్మార్ట్ శంకర్ గత నెలలోనే వచ్చింది కదా మళ్లీ నేడు విడుదల ఏంటీ అంటూ ఆశ్చర్య పోతున్నారా.
గత నెలలో విడుదలైనా కూడా నేడు మళ్లీ ఈ చిత్రంను రీ రిలీజ్ చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 థియేటర్లలో ఈ చిత్రంను విడుదల చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
మూడు రోజుల పాటు ఈ చిత్రం ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయబోతుంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఉన్న గ్యాంగ్ లీడర్, గద్దలకొండ గణేష్ చిత్రాలు తమ రన్ టైంను పూర్తి చేసుకున్నాయి.ఈ వారం ప్రేక్షకుల ముందుకు సినిమాలు ఏమీ రాకపోవడంతో ఇదే అదునైన సమయంగా భావించిన పూరి 10 ముఖ్యమైన థియేటర్లలో ఇస్మార్ట్ శంకర్ను విడుదల చేసినట్లుగా సమాచారం అందుతోంది.నేడు అంటే 27వ తారీకున ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మూడు రోజుల పాటు అంటే 27, 28, 29 తారీకుల వరకు థియేటర్లలో ఉండబోతుంది.
మూడు రోజుల పాటు థియేటర్లలో ప్రదర్శించి ఆ తర్వాత తీసేయనున్నారు.మూడు రోజుల్లో ఈ చిత్రం ఏ స్థాయిలో వసూళ్లు చేస్తుందనేది చూడాలి.ఇస్మార్ట్ శంకర్ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.ఆ సమయంలో కొన్ని కారణాల వల్ల కొందరు చూడాలేక పోయారని, ఇప్పుడు వారు సినిమాను చూస్తారని పూరి ఆశిస్తున్నాడు.
త్వరలో డిజిటల్ ప్లాట్ఫాంపై విడుదల కాబోతున్న ఈ చిత్రం అంతకు ముందు మరోసారి థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.మరి ఈ మూడు రోజుల్లో సినిమా పాతిక లక్షలు షేర్ దక్కించుకున్నా కూడా గొప్ప విషయమే.