యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరో రామ్ పోతినేని నటించిన పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘ఇస్మార్ట్ శంకర్’ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాతో రామ్ చాలా గ్యాప్ తరువాత అదిరిపోయే బ్లాక్బస్టర్ను అందుకున్నాడు.
క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.ఈ సినిమా అందించిన బూస్ట్తో తన నెక్ట్స్ చిత్రాలను చేస్తూ దూసుకెళ్తున్నాడు రామ్.
అయితే ఇస్మార్ట్ శంకర్ అందుకున్న సక్సెస్తో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అయ్యారు.
ఈ క్రమంలో ఇస్మార్ట్ శంకర్ చిత్రాన్ని బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు అక్కడి దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తుండటంతో ఈ సినిమా కోసం బాలీవుడ్ జనంతో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ సినిమాకు ఆదిలోనే బ్రేకులు పడ్డాయి.
ఈ సినిమా రీమేక్కు ప్రస్తుతం బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.అయితే ఈ సినిమా మేకర్స్లో మనస్పర్థలు రావడంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోయినట్లు బాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ క్లారిటీ రావాల్సిందే.
ఇక పూరీ-రామ్ కాంబినేషన్లో వచ్చిన ఈ ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలవడమే కాకుండా వసూళ్ల పరంగానూ తన సత్తా చాటింది.
ఈ సినిమాలో రామ్ స్టైలిష్ లుక్లో మెస్మరైజ్ చేయగా హీరోయిన్లు నిధి అగర్వాల్, నభా నటేష్లు వారి అందాల ఆరబోతతో కుర్రకారుకు పిచ్చెక్కించారు.ఇక ఈ సినిమా పాటలను ప్రేక్షకులు ఇంకా ఆదరిస్తూ వస్తున్నారు.
మరి టాలీవుడ్లో దుమ్ములేపిన ఇస్మార్ట్ శంకర్ చిత్రం బాలీవుడ్లో రీమేక్కు నోచుకుంటుందా లేక మరుగున పడుతుందా అనేది తెలియాల్సి ఉంది.మరి బాలీవుడ్ జనాలకు ఈ సినిమా ఎంతవరకు ఎక్కుతుందో అనేది కూడా చూడాలి.