తెలుగులో ప్రముఖ దర్శకుడు చందు మొండేటి దర్శకత్వం వహించిన “సవ్య సాచి” అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన ముంబై బ్యూటీ “నిధి అగర్వాల్” గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే ఫ్లాప్ (సవ్యసాచి, మిస్టర్ మజ్ను) ఎదుర్కొన్నప్పటికీ ఆ తర్వాత ప్రముఖ రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో తన అందాల ఆరబోతతో కుర్రకారు మతులు గెలుచుకుంది.
దీంతో ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ హిందీ, తమిళం, తెలుగు, పరిశ్రమల్లో బాగానే రాణిస్తోంది.
అయితే ప్రస్తుతం కరోనా కారణంగా సినిమా షూటింగులు లేకపోవడంతో ఇంటి పట్టునే ఖాళీగా ఉంటోంది.
దీంతో ఈ అమ్మడు బరువు తగ్గేందుకు వ్యాయామం మరియు సరైన ఆహారపు అలవాట్లు పాటిస్తూ దాదాపుగా 5 కేజీల వరకు బరువు తగ్గినట్లు తెలుస్తోంది.ఈ అమ్మడు బొద్దుగా ఉండడం వల్ల గ్లామర్ షో చేసేటప్పుడు పలు ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
అందువల్లనే బరువు తగ్గాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.దీంతో తాజాగా నిధి అగర్వాల్ తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా బాత్ రూమ్ లో తీసుకున్నటువంటి ఓ సెల్ఫీ ని షేర్ చేసింది.
అంతేగాక “బాత్ రూమ్ సెల్ఫీ” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది. దీంతో ఈ అమ్మడి అందానికి ఫిదా అయిన నెటిజన్లు లైకులు కామెంట్లు వర్షం కురిపించారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నిధి అగర్వాల్ తెలుగులో తెలుగు తెలుగుదేశం పార్టీ ప్రముఖ రాజకీయ నాయకుడు గల్లా జయదేవ్ తనయుడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న ఓ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే తమిళంలో స్టార్ హీరో జయం రవి హీరోగా నటించినటువంటి “భూమి” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.
ఇటీవలే “ఈశ్వరన్” అనే చిత్రంలో నటించేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.