ఐసిస్ ఉగ్రవాదులు ఇరాక్ దేశం లో రెచ్చిపోతున్నారు.ఉగ్రవాదులు చేస్తున్న దాడులకు ఇరాక్ దేశం అతలాకుతలమవుతోంది.
ఆ దేశానికి చెందిన పోలీసులనే టార్గెట్ చేసుకుని ఐసిస్ ఉగ్రవాద సంస్థలు చేసిన తాజా దాడులలో దాదాపు 13 మంది ఇరాకీ పోలీసులు.మరణించడం జరిగింది.
చెక్ పోస్ట్ వద్ద పహారా కాస్తున్న పోలీసులపై అర్ధరాత్రి సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడినట్లు ఆ దేశ సీనియర్ పోలీస్ అధికారి స్పష్టం చేశారు.
దాడి చేసిన ప్రాంతంలో గత కొన్ని రోజుల నుండి ఉగ్రవాదులు ఆర్మీ అధికారులు కూడా టార్గెట్ చేసుకుని.దాడులు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.అయితే ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో జరిగిన దాడులలో తాజాగా జరిగిన దాడి అతిపెద్ద దాడి అని.ఏకంగా 13 మంది పోలీసులు మరణించడం ఇదే తొలిసారి అని.ఆ అధికారి స్పష్టం చేశారు.ఉగ్రవాదులకు స్లీపర్ సేల్స్ గా ఉంటూ సమయం అదును చూసుకుని మరి దాడులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.