భారత్ ని టార్గెట్ చేసిన ఐసీస్! వారి మాటల్లో అర్ధం ఏంటి

ఇస్లామిక్ దేశాలకి పెను ప్రమాదంగా మారి దశాబ్ద కాలం నుంచి అక్కడి ప్రజలని భయబ్రాంతులకి గురి చేస్తున్న నరరూప రాక్షసులుగా ఉన్న ఐఎస్ఐఎస్ మూలలని పూర్తిగా తుడిచేసే ప్రయత్నం ఆ దేశాలు చేస్తున్నాయి.దీనికి అమెరికా కూడా పూర్తి సహకారం అందిస్తుంది.

 Isis Next Target Fixed On India-TeluguStop.com

అయితే ఇస్లామిక్ దేశాలలో ఉనికి కోల్పోయే స్థితిలో ఉన్న ఐసీస్ తమ నెక్స్ట్ టార్గెట్ గా భారత్ ని లక్ష్యంగా చేసుకుందా అంటే అవుననే మాట చాలా కాలంగా వినిపిస్తుంది.దానికి తగ్గట్లుగానే ఇండియాలో ఐసిస్ సానుబూతిపరులు ఈ మధ్య కాలంలో చాలా మంది అరెస్ట్ అయ్యారు.

వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ భారత్ పై తమ గురి పెట్టిందనే విషయం వాస్తవంలోకి వచ్చింది.

ఇప్పటికే పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న చాలా ఉగ్రవాద సంస్థలు భారత్ ని లక్ష్యంగా చేసుకొని ఇండియాలో హిందుత్వ సమాజం మీద ప్రతీకారంలో రగిలిపోతూ అవకాశం కోసం ప్రతి సారి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి.

అయితే ఇలా భారత్ పై దాడి చేస్తున్న ప్రతి సారి ఆ ఉగ్రవాద సంస్థలకి చావుదెబ్బలు తగులుతున్నాయి.అయితే తాజాగా ఐసిస్ ఉగ్రవాద సంస్థ తాము భారత్ లో ప్రావిన్స్ ఏర్పాటు చేసామని, తమ సైన్యం ఆర్మీకి తీవ్ర నష్టం కలిగించింది అంటూ ఓ రేడియో చానల్ లో ప్రకటించింది.

కాశ్మీర్ లో ఐసిస్ ఉగ్రవాదిన ఎన్ కౌంటర్ చేసిన కొద్ది గంటల్లోనే ఐసిస్ నుంచి ఇలాంటి ప్రకటన రావడం విశేషం.అయితే ఆ ప్రకటనలో వాస్తవం లేదని మిలటరీ అధికారులు స్పష్టం చేసేసారు.

వారు ఇండియాలో కాలు పెట్టె ధైర్యం కూడా చేయలేరని అంటున్నారు.మరి ఐసిస్ ప్రకటన అబద్దం అయిన వారి మాటల బట్టి నెక్స్ట్ ఆ ఉగ్రవాద సంస్థ ఇండియాలో విద్వంసం సృష్టించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్ధమవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube