ఈస్టర్ రోజుల క్రిస్టియన్స్ పూర్తిగా ప్రార్ధనలలో ఉన్న సమయంలో ఊహించని విధంగా కొలంబో మొత్తం బాంబులతో దద్దరిల్లింది.చర్చిలు, హోటల్స్ ని లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు కొన్ని చోట్ల ఆత్మాహుతి దాడులు చేయగా, మరికొన్ని చోట్ల బాంబులు పెట్టి బ్లాస్ట్ లు చేసారు.
ఓ విధంగా ఒకే రోజు సీరియల్స్ బ్లాస్ట్స్ ల వెనుక శ్రీలంక ప్రభుత్వ నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్ధమవుతుంది.నిఘా వర్ఘాలు హెచ్చరికలు చేసిన కూడా, ఎలాంటి భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ బాంబు దాడులకి ప్రధాన కారణం ఈ వరుస బాంబు పేలుళ్లలో 310 మంది మృతిచెందగా… వీరిలో ఎనిమిది మంది భారతీయులు కూడా ఉన్నారు.
అయితే, ఈ పేలుళ్ల వెనుక ఐసిస్ హస్తం ఉన్నట్టు విస్పష్టమైన ఆధారాలు లభించాయి.తాజాగా, ముగ్గురు ఉగ్రవాదుల ఫోటోలను ఐసిస్ సానుభూతి టెలిగ్రామ్ ఛానెల్స్ ప్రసారం చేశాయి.
ఐసిస్ జెండా పట్టుకున్న ఈ ముగ్గురు ఆత్మాహుతి సభ్యులను అబుల్ బర్రా, అబ్దుల్ ముఖ్తార్, అబు ఉబైదాగా గుర్తించారు.న్యూజిలాండ్ మసీదులో జరిగిన బాంబు దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఐఎస్ అధికార ప్రతినిధి అబు హసన్ అల్ ముజాహిర్ ఇటీవల ఓ ఆడియో క్లిప్ విడుదల చేశాడు.
ఈ నేపధ్యంలోనే ఐఎస్ఐఎస్ అక్కడ ప్రతీకారం కోసం శ్రీలంకని ఎంచుకున్నారని తెలుస్తుంది.