ఐసిస్ చీప్ అబు బకర్ అల్ బాగ్దాదీని అమెరిక సీక్రెట్ ఆపరేషన్ తో తుదముట్టించిన విషయం తెల్సిందే.అమెరికాను గడగడలాడించిన ఐసిస్ చీప్ మరణంపై ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేశాడు.
బాగ్దాదీని చంపిన తీరు వివరిస్తూ కుక్క చావు చచ్చాడు అంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేశాడు.అమెరికా ప్రకటించిన తర్వాత కూడా బాగ్దాదీ మరణించి ఉండడేమో అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.
కాని తాజాగా ఐసిస్ నుండి అధికారిక ప్రకటన వచ్చింది.తమ చీప్ బాగ్దాదీ చనిపోయినట్లుగా వారు అందులో పేర్కొన్నారు.
2016 నుండి ఐసిస్ చీప్ గా ఉన్న బాగ్దాదీ మృతి చెందారని, అయినా కూడా ఐసిస్ బలహీనం అవ్వదు.మేము మళ్లీ పుంజుకుని ప్రతీకార దాడులు నిర్వహిస్తామంటూ ఐసిస్ నుండి ప్రకటన వచ్చింది.
అమెరికాకు ఇదే మా హెచ్చరిక అంటూ తీవ్రమైన హెచ్చరికను ఐసిస్ చేసింది.ఈ హెచ్చరికతో అమెరికా అప్రమత్తం అవుతోంది.
సైనికులను అప్రమత్తంగా ఉంచడంతో పాటు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సెక్యూరిటీ పెంచడం మరియు ఇంకా ముఖ్యమైన ప్రదేశాల్లో సెక్యూరిటీని టైట్ చేయడం జరిగిందట.