ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు రోజు రోజుకి చెలరేగిపోతున్నారు….ఇష్టం వచ్చినట్లుగా దొరికిన వారిని ఛంపేస్తునారు.
ఇక ఈ నెల మొదటి వారంలో జరిగిన ఒక సంఘటన ఇస్లామిక్ ఉగ్రవాదులపై సరికొత్త కోణాన్ని బయట పెట్టింది…అందులో అత్యంత కిరాతకుడిగా పేరుగాంచిన వ్యక్తి పేరుని ప్రపంచ దర్యాప్తు సంస్ధలు బయట పెట్టాయి.అమెరికా జర్నలిస్ట్ జేమ్స్ ఫోలీని అతి కిరాతకంగా తల నరికి ఉగ్రవాదే ఈ జిహాదీ జాన్.
గత ఏడాది ఆగస్టులో అమెరికా జర్నలిస్ట్ని చంపిన వీడియోను యూట్యూబ్లో పోస్టు చేశాడు.వీడియోని వీక్షించిన యావత్ ప్రపంచం నివ్వెర పోయింది.
జర్నలిస్ట్ ఫొలీతో పాటు ఐసీస్ వద్ద బందీలుగా వున్న అనేకమందిని అత్యంత క్రూరంగా చంపాడు.అయితే ఈ ఉగ్రవాదిపై కన్నేసిన అనేక ఉగ్రవాద సంస్థలు అతను ఏ దేశానికి చెందిన వాడు.
పుట్టు పూర్వోత్రాలు సేకరించే పనిలో పడ్డాయి.ఇక అనేక పరిశోధనలు తరువాత.
వెల్లడైన సమాచారం ప్రకారం.అతని అసలు పేరు.
మహమ్మద్ ఎంవాజీగా గుర్తించారు.స్వదేశం కువైట్.
తన చిన్నతనంలోనే ఇంగ్లాండ్లో స్ధిరపడినట్లు తెలుస్తుంది.ఇక ఐసీస్ ఉగ్రవాదుల చెర నుంచి తప్పించుకున్న బందీలు తెలిపిన సమాచారం ప్రకారం అక్కడున్న ముగ్గురు బ్రిటీష్ జిహాదీలలో కెల్లా అత్యంత క్రూరుడు ఈ జిహాది జాన్ అని తెలుస్తుంది.
ఇతన్ని పట్టుకోవాడానికి అనేక దేశాలు ప్రయత్నాలు చేస్తునప్పటికీ చిక్కడం లేదు అని అంటున్నాయి పోలీసు వర్గాలు.