దేవకట్టా దర్శకత్వంలో ఐశ్వర్య రాజేష్ సాయి ధరమ్ తేజ్ జంటగా నటించినటువంటి చిత్రం రిపబ్లిక్.ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీ విడుదల కానుంది.
ఈ క్రమంలోనే ఐశ్వర్య రాజేష్ ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇంటర్వ్యూలలో పాల్గొని సినిమా గురించి ముచ్చటించారు.ఈ సందర్భంగా ఈ బ్యూటీ మాట్లాడుతూ రిపబ్లిక్ సినిమా పూర్తి కమర్షియల్ చిత్రం కాదు.
ఈ సినిమాను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కించారని తెలియజేశారు.
ఇక దర్శకుడి గురించి మాట్లాడుతూ ఆయన ఒక విజన్ ఉన్న వ్యక్తి.తను అనుకున్నది అనుకున్న విధంగా తెరపై చూపించడం కోసం ఎంతో శ్రమిస్తారని ఈ సందర్భంగా వెల్లడించింది.
ఈ క్రమంలోనే చాలా తక్కువ సమయంలో నా పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి చేశానని ఐశ్వర్య రాజేష్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా పేర్కొన్నారు.ఈ క్రమంలోనే సాయి ధరమ్ తేజ్ గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
సాయి ధరమ్ తేజ్ లో ఓ మంచి నటుడు దాగున్నాడని, ఆయన సినిమా కోసం ఎంతో కష్ట కష్టపడ్డారని తెలిపారు. చిన్నపిల్లలు మాదిరి స్క్రిప్ట్ రాసుకుని సంభాషణలను బాగా ప్రాక్టీస్ చేసేవారు.ఇక ఈ సినిమాలో కలెక్టర్ పాత్రలో సాయి తేజ్ నటన అద్భుతంగా ఉందని, ముఖ్యంగా కోర్టులో జరిగే సన్నివేశాలను సాయితేజ్ సింగిల్ టేక్ లో పూర్తి చేశారంటూ అతనిపై ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేశారు.సాయి తేజ్ ప్రమాదానికి గురవడం వల్ల ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్న సంగతి మనకు తెలిసిందే.