బాలీవుడ్ లో స్టార్ నటుడు నానా పటేకర్ మీద నేరుగా లైంగిక వేదింపుల ఆరోపణలు చేసి దేశ వ్యాప్తంగా మీటూ ఉద్యమాన్ని మొదలెట్టిన నటి తనుశ్రీ దత్తా.ఇక తనుశ్రీ ఇచ్చిన స్ఫూర్తితో ఇండియాలో చాలా మంది నటీమణులు, అలాగే ప్రముఖులు కూడా మీడియా ముందుకి వచ్చి సొసైటీలో ప్రముఖులుగా చలామణి అవుతున్న వారి భాగోతాలని బయటకి తీసుకొచ్చారు.
దీంతో దేశ వ్యాప్తంగా మీటూ అనేది పెద్ద చర్చనీయాంశంగా మారి లైంగిక వేదింపులకి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి.అయితే ప్రస్తుతానికి ఈ మీటూ కాంపైన్ వేడి దేశంలో లేకున్న, ఈ మీటూ ఉద్యమం కారణంగా ఇండస్ట్రీలో వేదింపులు మాత్రం తగ్గాయి అనేది చాలా మంది చెబుతున్న మాట.
ఇదిలా ఉంటే తాజాగా తనుశ్రీ దత్తా చెల్లి, టెలివిజన్ నటి ఇషితా దత్తా మీటూ కాంపైన్ పై స్పందించింది.తన అక్కడ ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలని ఎదుర్కుంది అనేది చూశానని, అప్పట్లో ఆమెపై భౌతిక దాడికి ప్రయత్నించిన వ్యక్తులు పోలీసులు లేకపోతే చంపెసేవారని చెప్పింది.
అయితే తన అక్క ధైర్యంగా ముందుకొచ్చి మీటూ కాంపైన్ ని మొదలెట్టడం హర్షించదగ్గ విషయం అని, ఆమె ఎంతో మంది నటీమణులకి మారదర్శకం అయ్యిందని, ఆమె స్ఫూర్తితో చాలా మంది తమకి జరిగిన లైంగిక వేధింపులపై మీడియా ముందుకొచ్చారని చెప్పుకొచ్చింది.అయితే అలాంటి అనుభవాలు ఎదురైనా తన అక్కడ తాను ఎంచుకున్న మార్గానికి అడ్డు చెప్పలేదని, ఇంకా ప్రోత్సహించింది అని ఇషితా చెప్పుకొచ్చింది.
అలాగే తన అక్కలాంటి వేదింపులు తనకి ఇండస్ట్రీలో ఎదురుకాలేదని చెప్పుకొచ్చింది.