టీమ్ ఇండియా క్రికెట్ లో ఇషాంత్ శర్మ గురించి ప్రత్యేకంగా ఎవరికీ పరిచయం చేయాల్సిన పని లేదు.ఇండియన్ పేస్ దళంతో కీలక బౌలర్ గా ఉన్న ఇషాంత్ చాలా మ్యాచ్ లలో టీమ్ ఇండియాకి గుర్తిండిపోయే విజయాలతో అందించాడు.
నిలకడగా రాణిస్తూ పేస్ దళాన్ని నడిపిస్తూ సత్తా చాటే ఇషాంత్ శర్మ టీమ్ ఇండియాలోకి వచ్చింది ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలోనే అలాగే తన ప్రతిభ అందరికి తెలిసింది కూడా అతని సమయంలోనే.అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఇషాంత్ శర్మ ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ధోని కెప్టెన్ గా ఉన్న సమయంలో టీమ్ ఇండియాలో పేస్ దళంలో ఏకంగా ఏడుగురు ఉండేవారని, దీంతో ఎక్కువగా రొటేషన్ పద్ధతిలో బౌలర్స్ ని ఉపయోగించేవారని తెలిపారు.ఈ కారణంగా సమన్వయం దెబ్బతిని నిలకడగా రాణించలేకపోయానని చెప్పాడు.
అయితే విరాట్ కెప్టెన్ అయిన తర్వాత పేస్ దళంలో నలుగురు మాత్రమే ఉండటం వలన అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని, భాగా రాణించేందుకు అవకాశం దొరుకుతుందని తెలిపాడు.విరాట్ కోహ్లి పేస్ దళాన్ని అద్బుతంగా నడిపిస్తూ నిలకడగా రాణించే అవకాశం ఇస్తున్నాడని తెలిపాడు.
అయితే ఇషాంత్ ఇప్పుడు చేసిన వాఖ్యలు ధోని ఫాన్స్ కి కాస్తా మంట కలిగించాయి.ధోని కారణంగా టీమ్ ఇండియాలో వెలుగులోకి వచ్చి ఇప్పుడు అతని మీద విమర్శలు చేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
అసలు నీకు కృతజ్ఞత భావం లేదని కూడా విమర్శిస్తునారు.అయితే ఇషాంత్ వ్యాఖ్యలపై మిస్టర్ కూల్ ధోని మాత్రం స్పందించేందుకు ఆసక్తి చూపించలేదని తెలుస్తుంది.