ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులను కరోనా మహమ్మారి బలి తీసుకుంటోంది.ఇక సామాన్యుల ప్రాణాలకు అయితే లెక్కేలేదు.
ఈ క్రమంలోనే ఓ స్టార్ హీరో సోదరుడు సైతం కరోనా కాటుకు బలైపోయారు.ప్రముఖ బాలీవుడ్ లెజెండ్రీ హీరో దిలీప్కుమార్ ఇంట్లో ఈ యేడాది వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
దిలీప్ తమ్ముడు ఇషాన్ ఖాన్ కరోనా భారీన పడి గురువారం మృతి చెందారు.గత నెలలో దిలీప్ కుమార్ సోదరులు ఇషాన్ ఖాన్, అస్లాం ఖాన్ ఇద్దరూ కూడా తీవ్ర అస్వస్థతతో బాధపడ్డారు.
దీంతో వారికి కరోనా టెస్టులు చేయగా ఇద్దరి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఇక హైబీపీ, గుండె జబ్బు ఉన్న అస్లాం ఖాన్ గత నెలలోనే మృతి చెందారు.
ఇక ఇప్పుడు ఇషాన్ ఖాన్ సైతం గుడెజబ్బు, రక్తపోటు, అల్జీమర్స్తో బాధపడుతూ బుధవారం రాత్రి ప్రాణాలు విడిచారు.వరుసగా సోదరులు మృతి చెందడంతో ఈ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇషాన్ ఖాన్ గత కొంత కాలంగా ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఇక పరిస్థితి విషమించడంతో గత రాత్రి ఆయన కన్నుమూశారు.ఏదేమైనా కరోనా కారణంగా కొద్ది రోజుల తేడాలోనే ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం బాధాకరం.
ఇషాన్ ఖాన్ మృతిపై పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఇక కరోనా సినిమా వాళ్లను కూడా వదలకుండా వెంటాడుతోంది.ఇప్పటికే బాలీవుడ్లో అమితాబచ్చన్ ఫ్యామిలీలో అందరూ కరోనా భారీన పడ్డారు.
వీరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.ఇక టాలీవుడ్లో దర్శకులు రాజమౌళి ఫ్యామిలీతో పాటు తేజ కూడా కరోనా భారీన పడి కోలుకున్నారు.ఇక లెజెండ్రీ గాయకుడు ఎస్పీ.బాలసుబ్రహ్మణ్యం కరోనాకు గురయ్యి ప్రాణాలతో పోరాటం చేసి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న సంగతి తెలిసిందే.