ఏపీలో ఎన్నికలకి మరో మూడు నెలల సమయం మాత్రమే మిగిలిఉంది.ఈ ఎన్నికల్లో ఎవరి గెలుపు ఎలా ఉండబోతోందో తెలియదూ కాని మొత్తానికి నాయకులకి మాత్రం పార్టీల వ్యూహ ప్రతి వ్యూహాలతో చెమటలు పడుతున్నాయి.
ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపుకు దూరం ఆ తరువాత భవిష్యత్తు ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఆ పార్టీ నేతలకి గుండెలు జల్లు మంటున్నాయి.ఇక పొతే వైసీపీ అధినేత జగన్ తానూ ముందుగానే టార్గెట్ పెట్టుకున్న వ్యూహాలతో జెట్ స్పీడుతో వెళ్తున్నాడు.అయితే
ఈ వ్యూహాలలో భాగంగానే పాదయాత్రని ముగించుకున్న జగన్ ఆ తరువాత యాత్రలో కవర్ చేయని నియోజకవర్గాలని బస్సు యాత్రతో చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ విషయం అందరికి తెలిసిందే.కాని ఒక్క సారిగా జగన్ మార్చి ఢిల్లీ పయనం అవుతున్నాడు.అయితే ఇప్పటికిప్పుడు జగన్ ఢిల్లీ వెళ్లాల్సిన అవసరం ఏముందన్న కోణంలో అన్నో రకాల ఊహగానాలు రేగుతున్నాయి.అంతేకాదు ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో భాగంగా బాబు ఈ నెల 11న ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు.
దీనికి తోడు
ఇప్పటికే పార్టీ నేతలు అందరూ ఢిల్లీ రావాల్సిందిగా ఆదేశాలు కూడా జారీచేశారు.ఇలాంటి సందర్భంలో జగన్ ఢిల్లీ పర్యటనపై మరింత ఆసక్తినెలకొంది.మరో పక్క జగన్ ఢిల్లీ టూర్ ఖారారు చేసుకోవడంతో ఒక్క సారిగా టీడీపీలో అలజడి రేగింది.అసలు జగన్ టూర్ కి కారణం ఏమిటి అనే లోచనలో పడ్డాయి.
అయితే కొంతమంది పరిశీలకుల అంచనా ప్రకారం.గత కొంతకాలంగా వైసీపీకి సానుభూతి పరులుగా ఉన్నవారి ఓట్లు తొలగిపోతున్నాయి.
అదే సమయంలో విజయనగరం జిల్లాలో సర్వేల పేరుతో ఓటర్ లిస్టు, ట్యాబ్ లతో వచ్చిన కొంతమందిని వైసీపీ వాళ్ళు పోలీసులకి అప్పగించారు కూడా.అయితే ఈ తతంగం వెనుక లోకేష్ బాబు హస్తం ఉన్నట్లుగా వార్తలు వినిపించాయి.
అయితే ఆ సర్వే చేసేవారి లక్ష్యం ఏమిటంటే వైసీపీ ఓట్లు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడమే అనేది ప్రధాన ఆరోపణ.
ఈ పరిణామాలపై ఇప్పటికే పోలీసుకేసులు పెట్టిన వైసీపీ , ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది.జగన్ సైతం తన ఢిల్లీ టూర్ లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలుస్తారని తెలుస్తోంది.ఓట్లని తెలగించడం వెనుక లోకేష్ ఉన్నాడని ఫిర్యాదు చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది.
దాంతో టీడీపీ నేతల్లో వణుకు మొదలయ్యింది.ఓట్ల తొలగింపు అనేది సామాన్యమైన విషయం కాదని అది తీవ్ర నేరమని ఈ విషయంలో కేసు నమోదైతే చినబాబు కి దబిడ దిబిడే అంటున్నారు విశ్లేషకులు.